అంత పొద్దున్నే సభకు రాజు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజు తన మంత్రులను పిలిచి,
"ప్రశ్నించకుండా నా వెంట రండి",
అని చెప్పి పట్టణం బయటి కాళికాలయానికి తీసుకువెళ్లాడు.
ఆ దేవికి నమస్కరించి గుడిలో ఒకమూలన ఉన్న
ఖడ్గం అందుకుని కొలువుకు తిరిగివెళ్లాడు.
ఈ వింత చూసిన సభలోని ప్రజలు విస్మయం చెందారు.
రాజు సింహాసనం మీద ఆసీనుడైన కొద్దిసేపటికి
వలలు, చిక్కాలు, విల్లంబులతో కొంతమంది
వేటగాళ్లు వచ్చారు. శత్రుంజయుడికి మొక్కి,
"మహారాజా, వేటలో మేము నేర్పరులము.
మా శక్తి, చాతుర్యం పరీక్షించి మీ దగ్గర చేర్చుకోమని
అడగటం కోసం వచ్చాము",
అని విన్నవించారు. వెంటనే వాళ్లని బంధించమని
రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు.
వాళ్లను వెతికిచూసిన భటులకు రహస్యంగా
దాచిన ఖడ్గాలు కనపడ్డాయి. కొద్దిగా బెదిరించగానే
వాళ్లు తమ మోసం ఒప్పుకున్నారు. ఇదంతా
రాజుకెలా తెలిసిందా అని అందరూ తెల్లబోయారు.
శత్రుంజయుడు ఆ దుర్మార్గులను చెరసాలలో వేయించి
మధ్యాహ్నం అవుతుండగా అంతఃపురం చేరాడు.
రాజుకేమీ తెలియదనుకుని అతడి భార్య అతి వినయంతో
ఉపచారాలు చేసి భోజనం తెప్పించింది.
రాజు ఆ అన్నం తినకుండా కొన్ని మెతుకులు ఒక కాకికి వేశాడు.
ఆ కాకి అవి తిని క్షణాలలో గిరగిర తిరిగి పడి ప్రాణాలు విడిచింది.
రాణి ఏమీ తెలియనట్లు ఆశ్చర్యం, భయం నటించబోయింది.
రాజు వెంటనే తన భటులను పిలిచి,
"ఈ విషపు అన్నంతో నన్ను చంపటానికి ప్రయత్నించి
ఏమీ ఎరుగని నిరపరాధినని అబద్ధం చెబుతోంది.
ఈ పాపాత్మురాలిని బంధించి సభకు తీసుకురండి",
అని కఠినంగా ఆజ్ఞాపించి కొలువు వైపు వెళ్లిపోయాడు.
బందీగా వచ్చిన రాణిని చూసి సభ ఆశ్చర్యపోయింది.
ఆమె తనకు పెట్టిన భోజనాన్ని శత్రుంజయుడు ఒక కుక్క ముందు ఉంచి
అది తిని ఆ కుక్క చనిపోవటం ప్రజలందరికీ చూపించాడు.
గుర్రపువాడిని పిలిపించి వాడి చేత కూడా సభలో నిజం చెప్పించి,
దేశం నుండి బహిష్కరించాడు. రాణిని నీళ్లు చల్లిన సున్నపురాళ్ల మీద
వేసి చంపవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు.
తర్వాత రాజు నాలుగురోజులు గడిపి ఐదవరోజు నమ్మకమైన తన మంత్రిని పిలిచాడు.
పాము కాటు వల్ల కలగబోయే మరణం గురించి చెప్పి దానికి విరుగుడుగా పనిచేసే
తీగను ఉద్యానవనంలో చూపించాడు. ఇద్దరూ తిరిగివస్తూండగానే ఒక త్రాచుపాము
రాజును కాటువేసి వెళ్లిపోయింది. రాజు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
స్వామిభక్తిపరాయణుడైన మంత్రి రాజు చెప్పిన తీగను వాడి రాజును కాపాడాడు.
రాజు సభకు తిరిగివచ్చి, రాత్రి జరిగిన విషయాలు,
అద్భుత మంచం ప్రభావం గురించి సభకు తెలియజేశాడు.
ఇంతటి మహిమ ఉంది కాబట్టే అంత వెల చెప్పాడు అని
అందరూ ఆ కంసాలి నేర్పును కొనియాడారు.
రాత్రి విన్న వృత్తాంతం ప్రకారమే నగరమధ్యంలో ఒక
రాతి స్తంభం నాటి దాని మీద ఆ ఖడ్గాన్ని ప్రతిష్ఠించాడు శత్రుంజయుడు.
ఆ మంచం సహాయంతో ఎంతో కాలం మంచి రాజ్యపాలన చేశాడు.
అతడు చనిపోగానే ఆ మంచం కూడా అదృశ్యమైంది.
కొన్ని తరాల తర్వాత ఈ ఊరి ప్రజలు ఇలా ఉన్నారు.
గుణాకరా, ఇదే నువ్వు చూసిన రాతిస్తంభం వృత్తాంతం",
అని కథ ముగించాడు.
తర్వాత గురుశిష్యులు కొంత ప్రయాణం సాగించి
ఒక భయంకరమైన అరణ్యంలో ప్రవేశించారు.
అక్కడ చుట్టూ చెట్లతో ఒక తేట నీటి కొలను
ఉండటం చూసి దాని పక్కనే బస చేశారు.
Saturday, November 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment