యోగానందుడు, గుణాకరుడు ఒక పల్లె బయట, ఏటి పక్కనున్న ఒక మర్రిచెట్టు నీడలో విడిది చేశారు. అప్పుడు యోగానందుడు తమ ఇద్దరికీ భోజనసామగ్రి కొనటానికి సరిపోయే ఒక నాణెం గుణాకరుడికి ఇచ్చి, "గుణాకరా, గ్రామంలోకి వెళ్లి మనకు ఈ పూటకు కావలసిన పప్పు, బియ్యం కొని, ఎవరినైనా అడిగి వంటపాత్రలు తీసుకురా", అని చెప్పాడు.
వట్టిచేతులతో ఉన్న యోగి తటాలున నాణెం ఇవ్వటం చూసి గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. యోగానందుడి మహిమను కొనియాడి గ్రామానికి వెళ్లి దినుసులు కొన్నాడు. తను ఎవరో తెలియకపోయినా ఆ ఊరివారు వంటపాత్రలను సంశయం లేకుండా ఇవ్వటం కూడా యోగి ప్రభావమని భావించాడు. త్వరగా తిరిగివచ్చి, స్నానం చేసి, పొయ్యి ఏర్పరిచి, వంట చేశాడు.
ఇద్దరూ భోజనం చేసిన తర్వాత, చల్లని చెట్టు నీడలో విశ్రమించిన గురువు పాదాలు ఒత్తుతూ గుణాకరుడు, "మహాత్మా, ఈ గ్రామంలో ఒక వింత చూశాను. ఊరిమధ్యలో విశాలంగా కొంత ప్రదేశం ఉంది. అందులో రెండు శిలాస్తంభాలు ఒకదానికొకటి పది గజాల దూరంలో ఉన్నాయి. ఈ స్తంభాలపైన అడ్డంగా ఒక బండరాయి ఉంది. దూలంలా వేసిన ఈ బండరాయి మధ్యలో దగ్గర దగ్గరగా ఉన్న రెండు రంధ్రాలకు బలమైన ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి.
ఈ రెండు గొలుసులూ తలకిందులుగా ఉన్న ఒకడి కాళ్లకు కట్టి ఉన్నాయి. అతడి స్థితికి నేను బాధపడ్డాను కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే, అది మనిషి ఆకారంలో ఉన్న ఒక ఇనుప బొమ్మ మాత్రమే అని తెలిసింది. అది అలా ఉండటానికి కారణమేమిటని ఈ ఊరివారిని అడిగాను. వాళ్లు ఆ బొమ్మ ఎప్పటి నుంచో అలా ఉందనీ, తమ తాతలకు కూడా దాని వృత్తాంతం తెలియదనీ చెప్పారు.
నాకు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది! తమరు జ్ఞానదృష్టి గలవారు. ఈ విశేషమేమిటో వివరించమని ప్రార్థన", అని అడిగాడు.
యోగానందుడు జ్ఞానదృష్టితో ఆ వృత్తాంతం తెలుసుకొని ఇలా చెప్పనారంభించాడు.
Saturday, August 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment