ఒక యువకుడు ముందు నడుస్తుండగా నలుగురు బోయీలు ఒక పల్లకీని మోస్తూ కోట వెనుక వాకిలి నుండి బయటికి వచ్చి సైన్యం మధ్యలోనుండి వెళ్లసాగారు.
వారిని ఒక సేనాని అడ్డగించి, రహస్యంగా ఎవరో కోట నుంచి బయటికి వస్తున్నారని వీరశేఖరుడికి వార్త పంపాడు.
వీరశేఖరుడు హుటాహుటిన అక్కడికి చేరి విచారణ ప్రారంభించాడు.
అప్పడు పల్లకీ ముందు ఉన్న యువకుడు,
"అయ్యా, మేము ఈ ఊరివాళ్లం కాము. ఇక్కడికి ఆమడ దూరంలోని గ్రామవాసులము.
ఈ పల్లకీలో ఉన్న యువకుడికి కడుపు ఉబ్బరం రావటం వల్ల విజయపురంలోని వైద్యుడి దగ్గరకు వచ్చాము.
రాగానే యుద్ధం మొదలవటం వల్ల ఈ కోటలో చిక్కుపడ్డాము.
ఈ ఊరివైద్యానికి గుణం కనపడక ఇంకెక్కడైనా చికిత్స దొరుకుతుందేమోనని వెళ్తున్నాము.
శత్రుసైనికులు ఆపుతారని తెలిసినా, రోగిని చూపి బతిమాలుదామని బయలుదేరాము.
ఈ ఊరితో, రాజుతో, యుద్ధంతో మాకు సంబంధమే లేదు.
ఇతడిని మీరు పరీక్షించి మమ్మల్ని విడిచిపెట్టి ప్రాణదానం చేయండి", అన్నాడు.
వీరశేఖరుడు కొంచెం ఆలోచించి, పల్లకీలోకి తొంగిచూసి, బాధతో మూల్గుతున్న రోగిని గమనించి, మిగిలిన సేనాపతులతో,
"నిజమే, పొట్ట పెరిగి ఉండటం స్పష్టంగా కనపడుతోంది.
వీరివల్ల మనకు ప్రమాదం ఉన్నట్లు అనిపించటం లేదు. విడిచిపెట్టండి", అని ఆజ్ఞాపించాడు.
వాళ్లు బయలుదేరగానే వీరశేఖరుడు మిగిలిన సైనికులను వారివారి స్థానాలకు తిరిగి పంపించాడు.
మరుసటిరోజు ఉదయం ప్రతాపవర్ధనుడు తన సేనాపతులతో వీరశేఖరుడిని పిలిపించాడు.
వాళ్లు వచ్చి,
"మహారాజా, అర్ధరాత్రి వరకు వీరశేఖరుడు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తరువాత నుండి కనిపించటం లేదు", అని
విన్నవించారు.
ప్రతాపవర్ధనుడు, "ఓహో, మోసపోయాము. ఆ వచ్చినవాడు వీరశేఖరుడు కాదు. శత్రువర్గం వాడెవడో వేషంలో వచ్చి పని సాధించుకుని వెళ్లిపోయాడు", అన్నాడు. అప్పుడు అతడి సేనానులు రాత్రి జరిగింది ప్రతాపవర్ధనుడికి వివరించారు. జరిగిన దానికి చింతించటం వ్యర్ధమని, కోటగోడలు కూల్చి విజయపురంలో ప్రవేశించమని ప్రతాపవర్ధనుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.
వారిని ఒక సేనాని అడ్డగించి, రహస్యంగా ఎవరో కోట నుంచి బయటికి వస్తున్నారని వీరశేఖరుడికి వార్త పంపాడు.
వీరశేఖరుడు హుటాహుటిన అక్కడికి చేరి విచారణ ప్రారంభించాడు.
అప్పడు పల్లకీ ముందు ఉన్న యువకుడు,
"అయ్యా, మేము ఈ ఊరివాళ్లం కాము. ఇక్కడికి ఆమడ దూరంలోని గ్రామవాసులము.
ఈ పల్లకీలో ఉన్న యువకుడికి కడుపు ఉబ్బరం రావటం వల్ల విజయపురంలోని వైద్యుడి దగ్గరకు వచ్చాము.
రాగానే యుద్ధం మొదలవటం వల్ల ఈ కోటలో చిక్కుపడ్డాము.
ఈ ఊరివైద్యానికి గుణం కనపడక ఇంకెక్కడైనా చికిత్స దొరుకుతుందేమోనని వెళ్తున్నాము.
శత్రుసైనికులు ఆపుతారని తెలిసినా, రోగిని చూపి బతిమాలుదామని బయలుదేరాము.
ఈ ఊరితో, రాజుతో, యుద్ధంతో మాకు సంబంధమే లేదు.
ఇతడిని మీరు పరీక్షించి మమ్మల్ని విడిచిపెట్టి ప్రాణదానం చేయండి", అన్నాడు.
వీరశేఖరుడు కొంచెం ఆలోచించి, పల్లకీలోకి తొంగిచూసి, బాధతో మూల్గుతున్న రోగిని గమనించి, మిగిలిన సేనాపతులతో,
"నిజమే, పొట్ట పెరిగి ఉండటం స్పష్టంగా కనపడుతోంది.
వీరివల్ల మనకు ప్రమాదం ఉన్నట్లు అనిపించటం లేదు. విడిచిపెట్టండి", అని ఆజ్ఞాపించాడు.
వాళ్లు బయలుదేరగానే వీరశేఖరుడు మిగిలిన సైనికులను వారివారి స్థానాలకు తిరిగి పంపించాడు.
మరుసటిరోజు ఉదయం ప్రతాపవర్ధనుడు తన సేనాపతులతో వీరశేఖరుడిని పిలిపించాడు.
వాళ్లు వచ్చి,
"మహారాజా, అర్ధరాత్రి వరకు వీరశేఖరుడు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తరువాత నుండి కనిపించటం లేదు", అని
విన్నవించారు.
ప్రతాపవర్ధనుడు, "ఓహో, మోసపోయాము. ఆ వచ్చినవాడు వీరశేఖరుడు కాదు. శత్రువర్గం వాడెవడో వేషంలో వచ్చి పని సాధించుకుని వెళ్లిపోయాడు", అన్నాడు. అప్పుడు అతడి సేనానులు రాత్రి జరిగింది ప్రతాపవర్ధనుడికి వివరించారు. జరిగిన దానికి చింతించటం వ్యర్ధమని, కోటగోడలు కూల్చి విజయపురంలో ప్రవేశించమని ప్రతాపవర్ధనుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.
No comments:
Post a Comment