అంత పొద్దున్నే సభకు రాజు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజు తన మంత్రులను పిలిచి,
"ప్రశ్నించకుండా నా వెంట రండి",
అని చెప్పి పట్టణం బయటి కాళికాలయానికి తీసుకువెళ్లాడు.
ఆ దేవికి నమస్కరించి గుడిలో ఒకమూలన ఉన్న
ఖడ్గం అందుకుని కొలువుకు తిరిగివెళ్లాడు.
ఈ వింత చూసిన సభలోని ప్రజలు విస్మయం చెందారు.
రాజు సింహాసనం మీద ఆసీనుడైన కొద్దిసేపటికి
వలలు, చిక్కాలు, విల్లంబులతో కొంతమంది
వేటగాళ్లు వచ్చారు. శత్రుంజయుడికి మొక్కి,
"మహారాజా, వేటలో మేము నేర్పరులము.
మా శక్తి, చాతుర్యం పరీక్షించి మీ దగ్గర చేర్చుకోమని
అడగటం కోసం వచ్చాము",
అని విన్నవించారు. వెంటనే వాళ్లని బంధించమని
రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు.
వాళ్లను వెతికిచూసిన భటులకు రహస్యంగా
దాచిన ఖడ్గాలు కనపడ్డాయి. కొద్దిగా బెదిరించగానే
వాళ్లు తమ మోసం ఒప్పుకున్నారు. ఇదంతా
రాజుకెలా తెలిసిందా అని అందరూ తెల్లబోయారు.
శత్రుంజయుడు ఆ దుర్మార్గులను చెరసాలలో వేయించి
మధ్యాహ్నం అవుతుండగా అంతఃపురం చేరాడు.
రాజుకేమీ తెలియదనుకుని అతడి భార్య అతి వినయంతో
ఉపచారాలు చేసి భోజనం తెప్పించింది.
రాజు ఆ అన్నం తినకుండా కొన్ని మెతుకులు ఒక కాకికి వేశాడు.
ఆ కాకి అవి తిని క్షణాలలో గిరగిర తిరిగి పడి ప్రాణాలు విడిచింది.
రాణి ఏమీ తెలియనట్లు ఆశ్చర్యం, భయం నటించబోయింది.
రాజు వెంటనే తన భటులను పిలిచి,
"ఈ విషపు అన్నంతో నన్ను చంపటానికి ప్రయత్నించి
ఏమీ ఎరుగని నిరపరాధినని అబద్ధం చెబుతోంది.
ఈ పాపాత్మురాలిని బంధించి సభకు తీసుకురండి",
అని కఠినంగా ఆజ్ఞాపించి కొలువు వైపు వెళ్లిపోయాడు.
బందీగా వచ్చిన రాణిని చూసి సభ ఆశ్చర్యపోయింది.
ఆమె తనకు పెట్టిన భోజనాన్ని శత్రుంజయుడు ఒక కుక్క ముందు ఉంచి
అది తిని ఆ కుక్క చనిపోవటం ప్రజలందరికీ చూపించాడు.
గుర్రపువాడిని పిలిపించి వాడి చేత కూడా సభలో నిజం చెప్పించి,
దేశం నుండి బహిష్కరించాడు. రాణిని నీళ్లు చల్లిన సున్నపురాళ్ల మీద
వేసి చంపవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు.
తర్వాత రాజు నాలుగురోజులు గడిపి ఐదవరోజు నమ్మకమైన తన మంత్రిని పిలిచాడు.
పాము కాటు వల్ల కలగబోయే మరణం గురించి చెప్పి దానికి విరుగుడుగా పనిచేసే
తీగను ఉద్యానవనంలో చూపించాడు. ఇద్దరూ తిరిగివస్తూండగానే ఒక త్రాచుపాము
రాజును కాటువేసి వెళ్లిపోయింది. రాజు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
స్వామిభక్తిపరాయణుడైన మంత్రి రాజు చెప్పిన తీగను వాడి రాజును కాపాడాడు.
రాజు సభకు తిరిగివచ్చి, రాత్రి జరిగిన విషయాలు,
అద్భుత మంచం ప్రభావం గురించి సభకు తెలియజేశాడు.
ఇంతటి మహిమ ఉంది కాబట్టే అంత వెల చెప్పాడు అని
అందరూ ఆ కంసాలి నేర్పును కొనియాడారు.
రాత్రి విన్న వృత్తాంతం ప్రకారమే నగరమధ్యంలో ఒక
రాతి స్తంభం నాటి దాని మీద ఆ ఖడ్గాన్ని ప్రతిష్ఠించాడు శత్రుంజయుడు.
ఆ మంచం సహాయంతో ఎంతో కాలం మంచి రాజ్యపాలన చేశాడు.
అతడు చనిపోగానే ఆ మంచం కూడా అదృశ్యమైంది.
కొన్ని తరాల తర్వాత ఈ ఊరి ప్రజలు ఇలా ఉన్నారు.
గుణాకరా, ఇదే నువ్వు చూసిన రాతిస్తంభం వృత్తాంతం",
అని కథ ముగించాడు.
తర్వాత గురుశిష్యులు కొంత ప్రయాణం సాగించి
ఒక భయంకరమైన అరణ్యంలో ప్రవేశించారు.
అక్కడ చుట్టూ చెట్లతో ఒక తేట నీటి కొలను
ఉండటం చూసి దాని పక్కనే బస చేశారు.
Saturday, November 21, 2009
Saturday, November 14, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 4
నాలుగో జాము ప్రారంభమైంది.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.
ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.
ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.
ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.
అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.
ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.
ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.
ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.
అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.
Saturday, November 7, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 3
ఇదే విధంగా మూడవ కోడు కూడా వెళ్లి ఒక జాము గడిచిన తర్వాత తిరిగి వచ్చి,
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.
Saturday, October 31, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 2
రాజు ఆ మంచం మీద పడుకున్నాడు కానీ నిద్రపోలేదు.
నిద్రపోతున్నవాడిలా ఊపిరివదులుతూ ఏమి జరుగుతుందో చూద్దామని ఉన్నాడు.
ఒక జాము రాత్రి గడవగానే ఆ మంచపుకోళ్లు మాట్లాడుకోవటం ప్రారంభించాయి.
ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన రాజు చెవులు రిక్కించి వినసాగాడు.
ఆ కోళ్లలో ఒకటి ఇలా అంది,
"చెలులారా, వాడుకప్రకారం నేను వెళ్లి పట్టణంలో విశేషాలు తెలుసుకుని వస్తాను.
రాజు నిద్రపోతున్నాడు. నిద్రలో ఒకవేళ కదిలితే నా వైపు వంగిపోకుండా మీరే భరించాలి".
ఆ కోడు పట్టెనుంచి కిరకిరమని వదిలించుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది.
రెండవ జాము మొదలవుతుందనగా అది తిరిగివచ్చి తన స్థానంలో నిలిచింది.
ఏమి విశేషం కనపడిందో చెప్పమని మిగిలిన మూడు కోళ్లూ దాన్ని అడిగాయి.
అప్పుడు ఆ మొదటి కోడు ఇలా చెప్పింది,
"నేను పట్టణమంతా తిరిగి తూర్పువీధికి చేరాను.
అప్పటికి ఈ ఊరివాళ్లు తింటూ, నిద్రపోతూ, నిద్రరాక లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉన్నారు.
పెద్దవిశేషాలేవీ కనపడలేదు. ఆ తూర్పువీధిలో ఒక గుడిమంటపంలో కొద్దిసేపు ఆగాను.
ఐదారుగురు మనుషులు వస్తున్నట్లు సవ్వడి అవటంతో ఒక రాతిస్తంభం వెనుక దాక్కున్నాను.
పెద్ద ఆకారాలతో, దృఢమైన శరీరాలతో, చేతిలో ఖడ్గాలతో వాళ్లు గుడిలోకి చేరుకున్నారు.
వారిలో ఒకడు ఇలా అన్నాడు,
'మిత్రులారా, మన రాజు వీరవర్మ ఈ ఊరి శత్రుంజయుడిని చంపటానికి మనల్ని పంపి వారం రోజులయింది.
మనకు సాధ్యం కావటం కాలేదు. తగిన సమయం దొరకటం లేదు'.
ఇంతలో ఇంకొకడు,
'సమయం కోసం వేచి ఉంటే ఎప్పటికీ మన పని జరగదు.
ఈ రాజుకు వేట అంటే ప్రాణం.
వేషాలలో రేపు సభకు వెళ్లి, మేము గడితేరిన వేటగాళ్లము, దేవర మాతో అడవికి వచ్చి మా ప్రావీణ్యం చూడాలి, అని అడుగుదాము.
అడవిలో శత్రుంజయుడిని సులువుగా చంపవచ్చు',
అని అన్నాడు.
ఇలా నిర్ణయించుకుని వాళ్లు వెళ్లే సమయానికి నా జాము ముగిసింది, తిరిగివచ్చాను.
వాళ్ల వల్ల ఈ రాజుకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని చింతగా ఉంది".
ఇంతలో రెండవ కోడు ఎగిరివెళ్లి మూడవ జాము సమయానికి తిరిగివచ్చి, ఇలా చెప్పసాగింది,
"నేను ఊరంతా తిరిగి దక్షిణపువాడలో ప్రవేశించాను.
ఈ సమయానికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ నిద్రపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఒక యువతి జుట్టువిరబోసుకుని గోడుగోడుమని ఏడుస్తూ నా ముందునుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపోయాను.
పరుగున తన దగ్గరకు వెళ్లి,
'అమ్మా, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎటు వెళ్తున్నావు?
నువ్వు ఏడవటానికి కారణమేమిటి?'
అని అడిగాను. నేను మానవ వ్యక్తిని కాకపోవటం వల్ల తన వృత్తాంతం నాకు చెప్పవచ్చని నిర్ణయించి,
'నేను ఈ పట్టణాన్ని పాలించే గ్రామదేవతను.
కాళికను. నాకు ప్రతి ఏడూ ప్రీతితో ఉత్సవాలు జరిపించే శత్రుంజయుడికి త్వరలో సర్పగండం ఉంది.
అదీ మరొక ఐదురోజుల్లో జరగబోతోంది.
అందువల్ల బాధపడుతున్నాను',
అని చెప్పింది.
పాముకాటు తర్వాత రాజును బ్రతికించే ఉపాయం లేదా అని నేను అడిగాను.
ఆమె,
'ఎందుకు లేదు?
శత్రుంజయుడి తోటలోనే పడమటివైపు ఒక పుట్ట ఉంది.
దానిమీద పెరుగుతున్న తీగను తవ్వి తెచ్చి, నూరి, నీళ్లతో ఇస్తే తిరిగి జీవిస్తాడు.
కానీ ఈ రహస్యం మానవులకు తెలిసేదెలాగ?'
అని అంది.
ఇంతలో మూడవజాము మొదలవుతోందని గమనించి వచ్చేశాను".
రాజుకు సర్పగండం ఉందన్న విషయం తెలిసి మిగలిన మూడు కోళ్లు కూడా చాలా బాధపడ్డాయి.
నిద్రపోతున్నవాడిలా ఊపిరివదులుతూ ఏమి జరుగుతుందో చూద్దామని ఉన్నాడు.
ఒక జాము రాత్రి గడవగానే ఆ మంచపుకోళ్లు మాట్లాడుకోవటం ప్రారంభించాయి.
ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన రాజు చెవులు రిక్కించి వినసాగాడు.
ఆ కోళ్లలో ఒకటి ఇలా అంది,
"చెలులారా, వాడుకప్రకారం నేను వెళ్లి పట్టణంలో విశేషాలు తెలుసుకుని వస్తాను.
రాజు నిద్రపోతున్నాడు. నిద్రలో ఒకవేళ కదిలితే నా వైపు వంగిపోకుండా మీరే భరించాలి".
ఆ కోడు పట్టెనుంచి కిరకిరమని వదిలించుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది.
రెండవ జాము మొదలవుతుందనగా అది తిరిగివచ్చి తన స్థానంలో నిలిచింది.
ఏమి విశేషం కనపడిందో చెప్పమని మిగిలిన మూడు కోళ్లూ దాన్ని అడిగాయి.
అప్పుడు ఆ మొదటి కోడు ఇలా చెప్పింది,
"నేను పట్టణమంతా తిరిగి తూర్పువీధికి చేరాను.
అప్పటికి ఈ ఊరివాళ్లు తింటూ, నిద్రపోతూ, నిద్రరాక లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉన్నారు.
పెద్దవిశేషాలేవీ కనపడలేదు. ఆ తూర్పువీధిలో ఒక గుడిమంటపంలో కొద్దిసేపు ఆగాను.
ఐదారుగురు మనుషులు వస్తున్నట్లు సవ్వడి అవటంతో ఒక రాతిస్తంభం వెనుక దాక్కున్నాను.
పెద్ద ఆకారాలతో, దృఢమైన శరీరాలతో, చేతిలో ఖడ్గాలతో వాళ్లు గుడిలోకి చేరుకున్నారు.
వారిలో ఒకడు ఇలా అన్నాడు,
'మిత్రులారా, మన రాజు వీరవర్మ ఈ ఊరి శత్రుంజయుడిని చంపటానికి మనల్ని పంపి వారం రోజులయింది.
మనకు సాధ్యం కావటం కాలేదు. తగిన సమయం దొరకటం లేదు'.
ఇంతలో ఇంకొకడు,
'సమయం కోసం వేచి ఉంటే ఎప్పటికీ మన పని జరగదు.
ఈ రాజుకు వేట అంటే ప్రాణం.
వేషాలలో రేపు సభకు వెళ్లి, మేము గడితేరిన వేటగాళ్లము, దేవర మాతో అడవికి వచ్చి మా ప్రావీణ్యం చూడాలి, అని అడుగుదాము.
అడవిలో శత్రుంజయుడిని సులువుగా చంపవచ్చు',
అని అన్నాడు.
ఇలా నిర్ణయించుకుని వాళ్లు వెళ్లే సమయానికి నా జాము ముగిసింది, తిరిగివచ్చాను.
వాళ్ల వల్ల ఈ రాజుకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని చింతగా ఉంది".
ఇంతలో రెండవ కోడు ఎగిరివెళ్లి మూడవ జాము సమయానికి తిరిగివచ్చి, ఇలా చెప్పసాగింది,
"నేను ఊరంతా తిరిగి దక్షిణపువాడలో ప్రవేశించాను.
ఈ సమయానికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ నిద్రపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఒక యువతి జుట్టువిరబోసుకుని గోడుగోడుమని ఏడుస్తూ నా ముందునుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపోయాను.
పరుగున తన దగ్గరకు వెళ్లి,
'అమ్మా, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎటు వెళ్తున్నావు?
నువ్వు ఏడవటానికి కారణమేమిటి?'
అని అడిగాను. నేను మానవ వ్యక్తిని కాకపోవటం వల్ల తన వృత్తాంతం నాకు చెప్పవచ్చని నిర్ణయించి,
'నేను ఈ పట్టణాన్ని పాలించే గ్రామదేవతను.
కాళికను. నాకు ప్రతి ఏడూ ప్రీతితో ఉత్సవాలు జరిపించే శత్రుంజయుడికి త్వరలో సర్పగండం ఉంది.
అదీ మరొక ఐదురోజుల్లో జరగబోతోంది.
అందువల్ల బాధపడుతున్నాను',
అని చెప్పింది.
పాముకాటు తర్వాత రాజును బ్రతికించే ఉపాయం లేదా అని నేను అడిగాను.
ఆమె,
'ఎందుకు లేదు?
శత్రుంజయుడి తోటలోనే పడమటివైపు ఒక పుట్ట ఉంది.
దానిమీద పెరుగుతున్న తీగను తవ్వి తెచ్చి, నూరి, నీళ్లతో ఇస్తే తిరిగి జీవిస్తాడు.
కానీ ఈ రహస్యం మానవులకు తెలిసేదెలాగ?'
అని అంది.
ఇంతలో మూడవజాము మొదలవుతోందని గమనించి వచ్చేశాను".
రాజుకు సర్పగండం ఉందన్న విషయం తెలిసి మిగలిన మూడు కోళ్లు కూడా చాలా బాధపడ్డాయి.
Saturday, October 17, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 1
గుణాకరుడు, యోగానందుడు వేకువజామునే బయలుదేరి మధ్యాహ్నానికి ఒక పట్టణం దగ్గరలో ఉన్న వనానికి చేరారు.
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.
యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.
అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.
ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.
ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.
అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.
మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.
"
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.
యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.
అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.
ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.
ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.
అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.
మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.
"
Saturday, October 10, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 5
అది రాతి నంది కాదు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.
బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.
చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!
కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.
ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.
ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.
లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.
బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.
చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!
కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.
ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.
ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.
లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.
Saturday, October 3, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 4
అక్కడ ఆడుకుంటున్న అర్చకుల పిల్లలకు మాయమాటలు చెప్పి, కొబ్బెర, బెల్లం ఇచ్చాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.
"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.
ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.
"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.
ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.
Subscribe to:
Posts (Atom)