అంత పొద్దున్నే సభకు రాజు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజు తన మంత్రులను పిలిచి,
"ప్రశ్నించకుండా నా వెంట రండి",
అని చెప్పి పట్టణం బయటి కాళికాలయానికి తీసుకువెళ్లాడు.
ఆ దేవికి నమస్కరించి గుడిలో ఒకమూలన ఉన్న
ఖడ్గం అందుకుని కొలువుకు తిరిగివెళ్లాడు.
ఈ వింత చూసిన సభలోని ప్రజలు విస్మయం చెందారు.
రాజు సింహాసనం మీద ఆసీనుడైన కొద్దిసేపటికి
వలలు, చిక్కాలు, విల్లంబులతో కొంతమంది
వేటగాళ్లు వచ్చారు. శత్రుంజయుడికి మొక్కి,
"మహారాజా, వేటలో మేము నేర్పరులము.
మా శక్తి, చాతుర్యం పరీక్షించి మీ దగ్గర చేర్చుకోమని
అడగటం కోసం వచ్చాము",
అని విన్నవించారు. వెంటనే వాళ్లని బంధించమని
రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు.
వాళ్లను వెతికిచూసిన భటులకు రహస్యంగా
దాచిన ఖడ్గాలు కనపడ్డాయి. కొద్దిగా బెదిరించగానే
వాళ్లు తమ మోసం ఒప్పుకున్నారు. ఇదంతా
రాజుకెలా తెలిసిందా అని అందరూ తెల్లబోయారు.
శత్రుంజయుడు ఆ దుర్మార్గులను చెరసాలలో వేయించి
మధ్యాహ్నం అవుతుండగా అంతఃపురం చేరాడు.
రాజుకేమీ తెలియదనుకుని అతడి భార్య అతి వినయంతో
ఉపచారాలు చేసి భోజనం తెప్పించింది.
రాజు ఆ అన్నం తినకుండా కొన్ని మెతుకులు ఒక కాకికి వేశాడు.
ఆ కాకి అవి తిని క్షణాలలో గిరగిర తిరిగి పడి ప్రాణాలు విడిచింది.
రాణి ఏమీ తెలియనట్లు ఆశ్చర్యం, భయం నటించబోయింది.
రాజు వెంటనే తన భటులను పిలిచి,
"ఈ విషపు అన్నంతో నన్ను చంపటానికి ప్రయత్నించి
ఏమీ ఎరుగని నిరపరాధినని అబద్ధం చెబుతోంది.
ఈ పాపాత్మురాలిని బంధించి సభకు తీసుకురండి",
అని కఠినంగా ఆజ్ఞాపించి కొలువు వైపు వెళ్లిపోయాడు.
బందీగా వచ్చిన రాణిని చూసి సభ ఆశ్చర్యపోయింది.
ఆమె తనకు పెట్టిన భోజనాన్ని శత్రుంజయుడు ఒక కుక్క ముందు ఉంచి
అది తిని ఆ కుక్క చనిపోవటం ప్రజలందరికీ చూపించాడు.
గుర్రపువాడిని పిలిపించి వాడి చేత కూడా సభలో నిజం చెప్పించి,
దేశం నుండి బహిష్కరించాడు. రాణిని నీళ్లు చల్లిన సున్నపురాళ్ల మీద
వేసి చంపవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు.
తర్వాత రాజు నాలుగురోజులు గడిపి ఐదవరోజు నమ్మకమైన తన మంత్రిని పిలిచాడు.
పాము కాటు వల్ల కలగబోయే మరణం గురించి చెప్పి దానికి విరుగుడుగా పనిచేసే
తీగను ఉద్యానవనంలో చూపించాడు. ఇద్దరూ తిరిగివస్తూండగానే ఒక త్రాచుపాము
రాజును కాటువేసి వెళ్లిపోయింది. రాజు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
స్వామిభక్తిపరాయణుడైన మంత్రి రాజు చెప్పిన తీగను వాడి రాజును కాపాడాడు.
రాజు సభకు తిరిగివచ్చి, రాత్రి జరిగిన విషయాలు,
అద్భుత మంచం ప్రభావం గురించి సభకు తెలియజేశాడు.
ఇంతటి మహిమ ఉంది కాబట్టే అంత వెల చెప్పాడు అని
అందరూ ఆ కంసాలి నేర్పును కొనియాడారు.
రాత్రి విన్న వృత్తాంతం ప్రకారమే నగరమధ్యంలో ఒక
రాతి స్తంభం నాటి దాని మీద ఆ ఖడ్గాన్ని ప్రతిష్ఠించాడు శత్రుంజయుడు.
ఆ మంచం సహాయంతో ఎంతో కాలం మంచి రాజ్యపాలన చేశాడు.
అతడు చనిపోగానే ఆ మంచం కూడా అదృశ్యమైంది.
కొన్ని తరాల తర్వాత ఈ ఊరి ప్రజలు ఇలా ఉన్నారు.
గుణాకరా, ఇదే నువ్వు చూసిన రాతిస్తంభం వృత్తాంతం",
అని కథ ముగించాడు.
తర్వాత గురుశిష్యులు కొంత ప్రయాణం సాగించి
ఒక భయంకరమైన అరణ్యంలో ప్రవేశించారు.
అక్కడ చుట్టూ చెట్లతో ఒక తేట నీటి కొలను
ఉండటం చూసి దాని పక్కనే బస చేశారు.
Saturday, November 21, 2009
Saturday, November 14, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 4
నాలుగో జాము ప్రారంభమైంది.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.
ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.
ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.
ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.
అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.
ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.
ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.
ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.
అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.
Saturday, November 7, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 3
ఇదే విధంగా మూడవ కోడు కూడా వెళ్లి ఒక జాము గడిచిన తర్వాత తిరిగి వచ్చి,
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.
Saturday, October 31, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 2
రాజు ఆ మంచం మీద పడుకున్నాడు కానీ నిద్రపోలేదు.
నిద్రపోతున్నవాడిలా ఊపిరివదులుతూ ఏమి జరుగుతుందో చూద్దామని ఉన్నాడు.
ఒక జాము రాత్రి గడవగానే ఆ మంచపుకోళ్లు మాట్లాడుకోవటం ప్రారంభించాయి.
ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన రాజు చెవులు రిక్కించి వినసాగాడు.
ఆ కోళ్లలో ఒకటి ఇలా అంది,
"చెలులారా, వాడుకప్రకారం నేను వెళ్లి పట్టణంలో విశేషాలు తెలుసుకుని వస్తాను.
రాజు నిద్రపోతున్నాడు. నిద్రలో ఒకవేళ కదిలితే నా వైపు వంగిపోకుండా మీరే భరించాలి".
ఆ కోడు పట్టెనుంచి కిరకిరమని వదిలించుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది.
రెండవ జాము మొదలవుతుందనగా అది తిరిగివచ్చి తన స్థానంలో నిలిచింది.
ఏమి విశేషం కనపడిందో చెప్పమని మిగిలిన మూడు కోళ్లూ దాన్ని అడిగాయి.
అప్పుడు ఆ మొదటి కోడు ఇలా చెప్పింది,
"నేను పట్టణమంతా తిరిగి తూర్పువీధికి చేరాను.
అప్పటికి ఈ ఊరివాళ్లు తింటూ, నిద్రపోతూ, నిద్రరాక లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉన్నారు.
పెద్దవిశేషాలేవీ కనపడలేదు. ఆ తూర్పువీధిలో ఒక గుడిమంటపంలో కొద్దిసేపు ఆగాను.
ఐదారుగురు మనుషులు వస్తున్నట్లు సవ్వడి అవటంతో ఒక రాతిస్తంభం వెనుక దాక్కున్నాను.
పెద్ద ఆకారాలతో, దృఢమైన శరీరాలతో, చేతిలో ఖడ్గాలతో వాళ్లు గుడిలోకి చేరుకున్నారు.
వారిలో ఒకడు ఇలా అన్నాడు,
'మిత్రులారా, మన రాజు వీరవర్మ ఈ ఊరి శత్రుంజయుడిని చంపటానికి మనల్ని పంపి వారం రోజులయింది.
మనకు సాధ్యం కావటం కాలేదు. తగిన సమయం దొరకటం లేదు'.
ఇంతలో ఇంకొకడు,
'సమయం కోసం వేచి ఉంటే ఎప్పటికీ మన పని జరగదు.
ఈ రాజుకు వేట అంటే ప్రాణం.
వేషాలలో రేపు సభకు వెళ్లి, మేము గడితేరిన వేటగాళ్లము, దేవర మాతో అడవికి వచ్చి మా ప్రావీణ్యం చూడాలి, అని అడుగుదాము.
అడవిలో శత్రుంజయుడిని సులువుగా చంపవచ్చు',
అని అన్నాడు.
ఇలా నిర్ణయించుకుని వాళ్లు వెళ్లే సమయానికి నా జాము ముగిసింది, తిరిగివచ్చాను.
వాళ్ల వల్ల ఈ రాజుకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని చింతగా ఉంది".
ఇంతలో రెండవ కోడు ఎగిరివెళ్లి మూడవ జాము సమయానికి తిరిగివచ్చి, ఇలా చెప్పసాగింది,
"నేను ఊరంతా తిరిగి దక్షిణపువాడలో ప్రవేశించాను.
ఈ సమయానికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ నిద్రపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఒక యువతి జుట్టువిరబోసుకుని గోడుగోడుమని ఏడుస్తూ నా ముందునుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపోయాను.
పరుగున తన దగ్గరకు వెళ్లి,
'అమ్మా, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎటు వెళ్తున్నావు?
నువ్వు ఏడవటానికి కారణమేమిటి?'
అని అడిగాను. నేను మానవ వ్యక్తిని కాకపోవటం వల్ల తన వృత్తాంతం నాకు చెప్పవచ్చని నిర్ణయించి,
'నేను ఈ పట్టణాన్ని పాలించే గ్రామదేవతను.
కాళికను. నాకు ప్రతి ఏడూ ప్రీతితో ఉత్సవాలు జరిపించే శత్రుంజయుడికి త్వరలో సర్పగండం ఉంది.
అదీ మరొక ఐదురోజుల్లో జరగబోతోంది.
అందువల్ల బాధపడుతున్నాను',
అని చెప్పింది.
పాముకాటు తర్వాత రాజును బ్రతికించే ఉపాయం లేదా అని నేను అడిగాను.
ఆమె,
'ఎందుకు లేదు?
శత్రుంజయుడి తోటలోనే పడమటివైపు ఒక పుట్ట ఉంది.
దానిమీద పెరుగుతున్న తీగను తవ్వి తెచ్చి, నూరి, నీళ్లతో ఇస్తే తిరిగి జీవిస్తాడు.
కానీ ఈ రహస్యం మానవులకు తెలిసేదెలాగ?'
అని అంది.
ఇంతలో మూడవజాము మొదలవుతోందని గమనించి వచ్చేశాను".
రాజుకు సర్పగండం ఉందన్న విషయం తెలిసి మిగలిన మూడు కోళ్లు కూడా చాలా బాధపడ్డాయి.
నిద్రపోతున్నవాడిలా ఊపిరివదులుతూ ఏమి జరుగుతుందో చూద్దామని ఉన్నాడు.
ఒక జాము రాత్రి గడవగానే ఆ మంచపుకోళ్లు మాట్లాడుకోవటం ప్రారంభించాయి.
ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన రాజు చెవులు రిక్కించి వినసాగాడు.
ఆ కోళ్లలో ఒకటి ఇలా అంది,
"చెలులారా, వాడుకప్రకారం నేను వెళ్లి పట్టణంలో విశేషాలు తెలుసుకుని వస్తాను.
రాజు నిద్రపోతున్నాడు. నిద్రలో ఒకవేళ కదిలితే నా వైపు వంగిపోకుండా మీరే భరించాలి".
ఆ కోడు పట్టెనుంచి కిరకిరమని వదిలించుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది.
రెండవ జాము మొదలవుతుందనగా అది తిరిగివచ్చి తన స్థానంలో నిలిచింది.
ఏమి విశేషం కనపడిందో చెప్పమని మిగిలిన మూడు కోళ్లూ దాన్ని అడిగాయి.
అప్పుడు ఆ మొదటి కోడు ఇలా చెప్పింది,
"నేను పట్టణమంతా తిరిగి తూర్పువీధికి చేరాను.
అప్పటికి ఈ ఊరివాళ్లు తింటూ, నిద్రపోతూ, నిద్రరాక లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉన్నారు.
పెద్దవిశేషాలేవీ కనపడలేదు. ఆ తూర్పువీధిలో ఒక గుడిమంటపంలో కొద్దిసేపు ఆగాను.
ఐదారుగురు మనుషులు వస్తున్నట్లు సవ్వడి అవటంతో ఒక రాతిస్తంభం వెనుక దాక్కున్నాను.
పెద్ద ఆకారాలతో, దృఢమైన శరీరాలతో, చేతిలో ఖడ్గాలతో వాళ్లు గుడిలోకి చేరుకున్నారు.
వారిలో ఒకడు ఇలా అన్నాడు,
'మిత్రులారా, మన రాజు వీరవర్మ ఈ ఊరి శత్రుంజయుడిని చంపటానికి మనల్ని పంపి వారం రోజులయింది.
మనకు సాధ్యం కావటం కాలేదు. తగిన సమయం దొరకటం లేదు'.
ఇంతలో ఇంకొకడు,
'సమయం కోసం వేచి ఉంటే ఎప్పటికీ మన పని జరగదు.
ఈ రాజుకు వేట అంటే ప్రాణం.
వేషాలలో రేపు సభకు వెళ్లి, మేము గడితేరిన వేటగాళ్లము, దేవర మాతో అడవికి వచ్చి మా ప్రావీణ్యం చూడాలి, అని అడుగుదాము.
అడవిలో శత్రుంజయుడిని సులువుగా చంపవచ్చు',
అని అన్నాడు.
ఇలా నిర్ణయించుకుని వాళ్లు వెళ్లే సమయానికి నా జాము ముగిసింది, తిరిగివచ్చాను.
వాళ్ల వల్ల ఈ రాజుకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని చింతగా ఉంది".
ఇంతలో రెండవ కోడు ఎగిరివెళ్లి మూడవ జాము సమయానికి తిరిగివచ్చి, ఇలా చెప్పసాగింది,
"నేను ఊరంతా తిరిగి దక్షిణపువాడలో ప్రవేశించాను.
ఈ సమయానికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ నిద్రపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఒక యువతి జుట్టువిరబోసుకుని గోడుగోడుమని ఏడుస్తూ నా ముందునుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపోయాను.
పరుగున తన దగ్గరకు వెళ్లి,
'అమ్మా, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎటు వెళ్తున్నావు?
నువ్వు ఏడవటానికి కారణమేమిటి?'
అని అడిగాను. నేను మానవ వ్యక్తిని కాకపోవటం వల్ల తన వృత్తాంతం నాకు చెప్పవచ్చని నిర్ణయించి,
'నేను ఈ పట్టణాన్ని పాలించే గ్రామదేవతను.
కాళికను. నాకు ప్రతి ఏడూ ప్రీతితో ఉత్సవాలు జరిపించే శత్రుంజయుడికి త్వరలో సర్పగండం ఉంది.
అదీ మరొక ఐదురోజుల్లో జరగబోతోంది.
అందువల్ల బాధపడుతున్నాను',
అని చెప్పింది.
పాముకాటు తర్వాత రాజును బ్రతికించే ఉపాయం లేదా అని నేను అడిగాను.
ఆమె,
'ఎందుకు లేదు?
శత్రుంజయుడి తోటలోనే పడమటివైపు ఒక పుట్ట ఉంది.
దానిమీద పెరుగుతున్న తీగను తవ్వి తెచ్చి, నూరి, నీళ్లతో ఇస్తే తిరిగి జీవిస్తాడు.
కానీ ఈ రహస్యం మానవులకు తెలిసేదెలాగ?'
అని అంది.
ఇంతలో మూడవజాము మొదలవుతోందని గమనించి వచ్చేశాను".
రాజుకు సర్పగండం ఉందన్న విషయం తెలిసి మిగలిన మూడు కోళ్లు కూడా చాలా బాధపడ్డాయి.
Saturday, October 17, 2009
మూడవ మకాము - అద్భుత మంచము కథ - 1
గుణాకరుడు, యోగానందుడు వేకువజామునే బయలుదేరి మధ్యాహ్నానికి ఒక పట్టణం దగ్గరలో ఉన్న వనానికి చేరారు.
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.
యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.
అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.
ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.
ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.
అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.
మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.
"
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.
యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.
అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.
ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.
ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.
అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.
మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.
భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.
"
Saturday, October 10, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 5
అది రాతి నంది కాదు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.
బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.
చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!
కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.
ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.
ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.
లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.
బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.
చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!
కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.
ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.
ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.
లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.
Saturday, October 3, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 4
అక్కడ ఆడుకుంటున్న అర్చకుల పిల్లలకు మాయమాటలు చెప్పి, కొబ్బెర, బెల్లం ఇచ్చాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.
"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.
ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.
"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.
ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.
Saturday, September 26, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 3
లోపలికి వచ్చిన వేదశర్మతో,
"స్వామీ, మరేమీ లేదు. ఒక చిన్న విషయం.
ఈ సాయంత్రంలోగా మీకేమైనా ధనలాభం కలిగితే అది నాకు చెందేలాగా ఒక చీటీ రాసి ఇవ్వవలసింది.
నేను ఒక కారణం వల్ల ఇలా అడుగుతున్నాను", అని అన్నాడు.
కపటమెరుగని వేదశర్మ,
"సాయంత్రంలోగా నాకు కలిగే లాభమేముంది?
అయినా, ఇంత ధనమిచ్చిన ఇతడికి ఆ చీటీ రాసివ్వటం ఉచితమే"
అని ఆలోచించి, "సరే, అలాగే రాసి ఇస్తాను", అన్నాడు.
ఆ వర్తకుడు సిద్ధంగా ఉన్న తాటాకు, గంటము తెచ్చి,
"శాలివాహన శకము 436 వ సంవత్సరమునకు సరియైన అక్షయసంవత్సర వైశాఖశుద్ధ దశమి గురువారము
కుబేరగుప్తుడను వర్తక శిఖామణికి వేదశర్మ యనెడి నేను వ్రాసియిచ్చిన యాదాయబాధ్యత విడుదల పత్రము.
యేమనిన నేటి సాయంకాలములోపల యిపుడు వర్తకుని వలన నేను పొందినధనము తప్ప మరి నాకు కలిగెడి
యెట్టిలాభముగాని యీవణిక్శిఖామణికి చెందవలసినదియేకాని, నాకును నావారసులకును యేలాటి బాధ్యతయును
లేదు. ఇది నేను మనఃపూర్వకముగా స్వహస్తముతో వ్రాసియిచ్చిన పత్రము,
వేదశర్మ చేవ్రాలు"
అని పత్రం రాయించుకున్నాడు.
వేదశర్మను ఇంటికి సాగనంపి, సాయంత్రంలోగా ఎనిమిదివేల నిష్కములు వస్తాయని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
వేదశర్మ తన భార్యకు జరిగినదంతా చెప్పి, తన బిడ్డలతో తృప్తిగా తిని, సుఖంగా ఉన్నాడు.
కుబేరగుప్తుడు మధ్యాహ్నం దాకా ఎలాగో గడిపాడు కానీ, తర్వాత అతడి మనసు పరిపరివిధాల ఆలోచించింది,
"అయ్యో! బుద్ధిహీనుడా! నీ ప్రతిభ ఇంతేనా?
దయ్యమో భూతమో దేవళంలో అన్న మాటలు విని చేజేతులా రెండువేలు సమర్పించుకున్నావే!
ఆ డబ్బు వస్తుందని ఏమి నమ్మకం? "
అని తనను తాను నిందించుకున్నాడు.
మళ్లీ వెంటనే,
"ఛీ, గుడిలో పిశాచాలుంటాయా!
శివుడు నందితో అన్న మాటలు స్పష్టంగా విన్నాను కదా.
భగవంతుడు అబద్ధం చెప్తాడా?
ధనం తప్పకుండా వస్తుంది",
అని ఆలోచించి తుదకు ఇలా నిశ్చయించుకున్నాడు,
"సరే! జరగవలసింది జరిగిపోయింది.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
ప్రయత్నిస్తాను. డబ్బు వచ్చిందా సంతోషం.
లేకపోతే ఇద్దరు మనుషులతో వేదశర్మ ఇల్లు దోపిడీ చేయిస్తాను.
ఇప్పటికి అతడేమీ ఖర్చుపెట్టి ఉండడు".
కుబేరగుప్తుడు సాయంత్రం వరకూ ఇలా కాలం గడిపి, డబ్బు తెచ్చుకోవటానికి సంచులు,
కొంచెం కొబ్బెర, బెల్లం తీసుకొని, పైపంచె కప్పుకొని, సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరికీ తెలియకుండా శివాలయం చేరుకున్నాడు.
"స్వామీ, మరేమీ లేదు. ఒక చిన్న విషయం.
ఈ సాయంత్రంలోగా మీకేమైనా ధనలాభం కలిగితే అది నాకు చెందేలాగా ఒక చీటీ రాసి ఇవ్వవలసింది.
నేను ఒక కారణం వల్ల ఇలా అడుగుతున్నాను", అని అన్నాడు.
కపటమెరుగని వేదశర్మ,
"సాయంత్రంలోగా నాకు కలిగే లాభమేముంది?
అయినా, ఇంత ధనమిచ్చిన ఇతడికి ఆ చీటీ రాసివ్వటం ఉచితమే"
అని ఆలోచించి, "సరే, అలాగే రాసి ఇస్తాను", అన్నాడు.
ఆ వర్తకుడు సిద్ధంగా ఉన్న తాటాకు, గంటము తెచ్చి,
"శాలివాహన శకము 436 వ సంవత్సరమునకు సరియైన అక్షయసంవత్సర వైశాఖశుద్ధ దశమి గురువారము
కుబేరగుప్తుడను వర్తక శిఖామణికి వేదశర్మ యనెడి నేను వ్రాసియిచ్చిన యాదాయబాధ్యత విడుదల పత్రము.
యేమనిన నేటి సాయంకాలములోపల యిపుడు వర్తకుని వలన నేను పొందినధనము తప్ప మరి నాకు కలిగెడి
యెట్టిలాభముగాని యీవణిక్శిఖామణికి చెందవలసినదియేకాని, నాకును నావారసులకును యేలాటి బాధ్యతయును
లేదు. ఇది నేను మనఃపూర్వకముగా స్వహస్తముతో వ్రాసియిచ్చిన పత్రము,
వేదశర్మ చేవ్రాలు"
అని పత్రం రాయించుకున్నాడు.
వేదశర్మను ఇంటికి సాగనంపి, సాయంత్రంలోగా ఎనిమిదివేల నిష్కములు వస్తాయని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
వేదశర్మ తన భార్యకు జరిగినదంతా చెప్పి, తన బిడ్డలతో తృప్తిగా తిని, సుఖంగా ఉన్నాడు.
కుబేరగుప్తుడు మధ్యాహ్నం దాకా ఎలాగో గడిపాడు కానీ, తర్వాత అతడి మనసు పరిపరివిధాల ఆలోచించింది,
"అయ్యో! బుద్ధిహీనుడా! నీ ప్రతిభ ఇంతేనా?
దయ్యమో భూతమో దేవళంలో అన్న మాటలు విని చేజేతులా రెండువేలు సమర్పించుకున్నావే!
ఆ డబ్బు వస్తుందని ఏమి నమ్మకం? "
అని తనను తాను నిందించుకున్నాడు.
మళ్లీ వెంటనే,
"ఛీ, గుడిలో పిశాచాలుంటాయా!
శివుడు నందితో అన్న మాటలు స్పష్టంగా విన్నాను కదా.
భగవంతుడు అబద్ధం చెప్తాడా?
ధనం తప్పకుండా వస్తుంది",
అని ఆలోచించి తుదకు ఇలా నిశ్చయించుకున్నాడు,
"సరే! జరగవలసింది జరిగిపోయింది.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
ప్రయత్నిస్తాను. డబ్బు వచ్చిందా సంతోషం.
లేకపోతే ఇద్దరు మనుషులతో వేదశర్మ ఇల్లు దోపిడీ చేయిస్తాను.
ఇప్పటికి అతడేమీ ఖర్చుపెట్టి ఉండడు".
కుబేరగుప్తుడు సాయంత్రం వరకూ ఇలా కాలం గడిపి, డబ్బు తెచ్చుకోవటానికి సంచులు,
కొంచెం కొబ్బెర, బెల్లం తీసుకొని, పైపంచె కప్పుకొని, సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరికీ తెలియకుండా శివాలయం చేరుకున్నాడు.
Saturday, September 19, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 2
అతనికి దుర్బుద్ధి పుట్టి, మనసులో, "ఓహో, బికారి బాపడికి శివుడు పదివేలు ధనం ఇవ్వదలిచాడు.
అది నేడే జరిగేలా ఉంది. నందీశ్వరుడు సాయంకాలంలోగా ఇస్తానని అంగీకరించాడు.
ఏదైనా ఉపాయం వెతికి వేదశర్మకి రానున్న డబ్బును అపహరించాలి", అని ఆలోచిస్తూ
పరుగున ఇంటికి వెళ్లి, భిక్షాటన కోసం ఆ వీధికి రోజూ వచ్చే వేదశర్మ కోసం బయట కాచుకు కూర్చున్నాడు.
వేదశర్మ ఎప్పటిలాగే గ్రామమంతా తిరిగి దొరికిన కొద్ది బియ్యంతో, ఆకలికి పిల్లలు నకనకలాడుతుంటారని, త్వరత్వరగా ఇంటివైపు వెళ్లసాగాడు.
దారిలోనే కాచుకున్న కుబేరగుప్తుడు వేదశర్వ కనపడగానే మహావినయంతో నమస్కరించి,
"స్వామీ, మీ ప్రభావం గురించి ఇప్పుడే తెలిసింది.
నేను ఈ రోజు ఒక గొప్ప దానం చేయదలిచాను.
పరమయోగ్యులైన మీకే ఆ దానమివ్వాలని ఇక్కడ వేచి ఉన్నాను.
ఆ దానానికి మీరే అర్హులు.
మా ఇంటిలోకి దయచేసి దానం పుచ్చుకోండి",
అని కోరాడు.
ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
ఎందుకంటే ఆ ఇంటిముందునుంచి ఎప్పుడు వెళ్లినా, కుబేరగుప్తుడు మహాకోపంతో ఛీకొట్టి,
"పో పో, రోజూ నీకు భిక్షమెవరు పెడతారు?
అందరూ సంసారాలున్నవాళ్లే.
వారివారి కష్టాలెన్నో ఉంటాయి.
శనిలాగా వచ్చి వాకిట నిలుస్తావు.
ఒకసారి చెపితే అర్థం కాదా?
నీకు బుద్ధిలేదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో",
అని నానాదుర్భాషలాడి, ఒక్కనాడు కూడా పిడికెడు బియ్యమైనా ఇవ్వకుండా తరిమేవాడు.
తను బాధపడకుండా, ఇది తన దారిద్ర్యఫలితమని భావించి, కుబేరగుప్తుడు చెప్పేవి నిజాలే అయినా,
తన దుర్దశ వల్ల, రోషానికి పోకుండా, భిక్షం పెట్టినా పెట్టకపోయినా రోజూ అతడి ఇంటితో సహా అన్ని ఇళ్లకూ వెళ్లేవాడు.
ఒక్కరోజు కూడా బిచ్చం పెట్టని ఆ వర్తకుడు ఇప్పుడు వినయంగా ఆహ్వానించి దానం ఇస్తాననటం వేదశర్మకు కలలా అనిపించింది.
ఇదంతా దైవకృప అనుకొని,
"అయ్యా, మహద్భాగ్యం.
మీ ఇష్టం వచ్చినట్లే చేయండి.
కానీ, ముందు నా దగ్గరున్న బియ్యం తీసుకువెళ్లి నా భార్యాపిల్లలకు ఇచ్చి వస్తాను.
వాళ్లు ఆకలితో ఉంటారు",
అని చెప్పాడు.
కుబేరగుప్తుడు చాలా జాలిపడుతున్నట్లు నటించి,
"అయ్యో, పాపం, పసిపాపలు కదా, ఎంత కష్టపడుతున్నారో.
దారిద్ర్యమెంత దుఃఖకరం. స్వామీ, ఈ పనికోసం మీరు వెళ్లనక్కర్లేదు.
అన్నీ నేను చూసుకుంటాను, మీరు లోపల కూర్చోండి.
మీకు కావలిసిన సామగ్రి ఇప్పుడే సేవకుడితో పంపిస్తాను",
అని వేదశర్మ చేయి పట్టుకుని, లోపలికి తీసుకువెళ్లి, ఉన్నతపీఠం పైన కూర్చోబెట్టి,
ఒక సేవకుడితో, నాలుగు ముంతల బియ్యం, తగినంత ఉప్పు, పప్పు, నేయి, నూనె, కూరలు, విస్తళ్లు వేదశర్మ ఇంటికి పంపాడు.
సేవకుడు అలాగే చేసి, "అయ్యగారు రావటానికి కొంత ఆలస్యమౌతుంది. పెద్ద సెట్టి గారింట్లో ఉన్నారు", అని చెప్పి తిరిగివచ్చాడు.
ఆ రోజు వేదశర్మకు సముద్రం పొంగినంత ఆనందం కలిగింది. కుబేరగుప్తుడి ప్రవర్తన దైవలీలగా భావించాడు.
ఇంతలో కుబేరగుప్తుడు ఒక తట్టలో తమలపాకులు, వక్కలు, ఏలకాయలు, లవంగాలు, రెండువేల నిష్కములు తెచ్చి వేదశర్మకు సమర్పించి,
"స్వామీ, మిమ్మల్ని ఇన్నాళ్లూ చులకనగా చూసినందుకు దోషపరిహారముగా అల్పమైన ఈ మొత్తాన్ని స్వీకరించి,
మీ దాసుడినైన నన్ను దీవించండి", అని ప్రార్థించాడు.
రెండువేలను అల్పమైన మొత్తం అంటున్న ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
కుబేరగుప్తుడు కోరినట్లే ఆ ధనం స్వీకరించి, అతడిని ఆశీర్వదించి వేదశర్మ తన ఇంటికి బయలుదేరాడు.
కానీ, కుబేరగుప్తుడి ఇంటివాకిలి దాటాడో లేదో, ఆ వర్తకుడు ఏదో చెప్పటం మరచిన వాడిలా పరుగు పరుగున బయటికి వచ్చి,
"స్వామీ, స్వామీ, ఒక మాట, ఇటు రండి", అని పిలిచాడు.
అది నేడే జరిగేలా ఉంది. నందీశ్వరుడు సాయంకాలంలోగా ఇస్తానని అంగీకరించాడు.
ఏదైనా ఉపాయం వెతికి వేదశర్మకి రానున్న డబ్బును అపహరించాలి", అని ఆలోచిస్తూ
పరుగున ఇంటికి వెళ్లి, భిక్షాటన కోసం ఆ వీధికి రోజూ వచ్చే వేదశర్మ కోసం బయట కాచుకు కూర్చున్నాడు.
వేదశర్మ ఎప్పటిలాగే గ్రామమంతా తిరిగి దొరికిన కొద్ది బియ్యంతో, ఆకలికి పిల్లలు నకనకలాడుతుంటారని, త్వరత్వరగా ఇంటివైపు వెళ్లసాగాడు.
దారిలోనే కాచుకున్న కుబేరగుప్తుడు వేదశర్వ కనపడగానే మహావినయంతో నమస్కరించి,
"స్వామీ, మీ ప్రభావం గురించి ఇప్పుడే తెలిసింది.
నేను ఈ రోజు ఒక గొప్ప దానం చేయదలిచాను.
పరమయోగ్యులైన మీకే ఆ దానమివ్వాలని ఇక్కడ వేచి ఉన్నాను.
ఆ దానానికి మీరే అర్హులు.
మా ఇంటిలోకి దయచేసి దానం పుచ్చుకోండి",
అని కోరాడు.
ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
ఎందుకంటే ఆ ఇంటిముందునుంచి ఎప్పుడు వెళ్లినా, కుబేరగుప్తుడు మహాకోపంతో ఛీకొట్టి,
"పో పో, రోజూ నీకు భిక్షమెవరు పెడతారు?
అందరూ సంసారాలున్నవాళ్లే.
వారివారి కష్టాలెన్నో ఉంటాయి.
శనిలాగా వచ్చి వాకిట నిలుస్తావు.
ఒకసారి చెపితే అర్థం కాదా?
నీకు బుద్ధిలేదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో",
అని నానాదుర్భాషలాడి, ఒక్కనాడు కూడా పిడికెడు బియ్యమైనా ఇవ్వకుండా తరిమేవాడు.
తను బాధపడకుండా, ఇది తన దారిద్ర్యఫలితమని భావించి, కుబేరగుప్తుడు చెప్పేవి నిజాలే అయినా,
తన దుర్దశ వల్ల, రోషానికి పోకుండా, భిక్షం పెట్టినా పెట్టకపోయినా రోజూ అతడి ఇంటితో సహా అన్ని ఇళ్లకూ వెళ్లేవాడు.
ఒక్కరోజు కూడా బిచ్చం పెట్టని ఆ వర్తకుడు ఇప్పుడు వినయంగా ఆహ్వానించి దానం ఇస్తాననటం వేదశర్మకు కలలా అనిపించింది.
ఇదంతా దైవకృప అనుకొని,
"అయ్యా, మహద్భాగ్యం.
మీ ఇష్టం వచ్చినట్లే చేయండి.
కానీ, ముందు నా దగ్గరున్న బియ్యం తీసుకువెళ్లి నా భార్యాపిల్లలకు ఇచ్చి వస్తాను.
వాళ్లు ఆకలితో ఉంటారు",
అని చెప్పాడు.
కుబేరగుప్తుడు చాలా జాలిపడుతున్నట్లు నటించి,
"అయ్యో, పాపం, పసిపాపలు కదా, ఎంత కష్టపడుతున్నారో.
దారిద్ర్యమెంత దుఃఖకరం. స్వామీ, ఈ పనికోసం మీరు వెళ్లనక్కర్లేదు.
అన్నీ నేను చూసుకుంటాను, మీరు లోపల కూర్చోండి.
మీకు కావలిసిన సామగ్రి ఇప్పుడే సేవకుడితో పంపిస్తాను",
అని వేదశర్మ చేయి పట్టుకుని, లోపలికి తీసుకువెళ్లి, ఉన్నతపీఠం పైన కూర్చోబెట్టి,
ఒక సేవకుడితో, నాలుగు ముంతల బియ్యం, తగినంత ఉప్పు, పప్పు, నేయి, నూనె, కూరలు, విస్తళ్లు వేదశర్మ ఇంటికి పంపాడు.
సేవకుడు అలాగే చేసి, "అయ్యగారు రావటానికి కొంత ఆలస్యమౌతుంది. పెద్ద సెట్టి గారింట్లో ఉన్నారు", అని చెప్పి తిరిగివచ్చాడు.
ఆ రోజు వేదశర్మకు సముద్రం పొంగినంత ఆనందం కలిగింది. కుబేరగుప్తుడి ప్రవర్తన దైవలీలగా భావించాడు.
ఇంతలో కుబేరగుప్తుడు ఒక తట్టలో తమలపాకులు, వక్కలు, ఏలకాయలు, లవంగాలు, రెండువేల నిష్కములు తెచ్చి వేదశర్మకు సమర్పించి,
"స్వామీ, మిమ్మల్ని ఇన్నాళ్లూ చులకనగా చూసినందుకు దోషపరిహారముగా అల్పమైన ఈ మొత్తాన్ని స్వీకరించి,
మీ దాసుడినైన నన్ను దీవించండి", అని ప్రార్థించాడు.
రెండువేలను అల్పమైన మొత్తం అంటున్న ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
కుబేరగుప్తుడు కోరినట్లే ఆ ధనం స్వీకరించి, అతడిని ఆశీర్వదించి వేదశర్మ తన ఇంటికి బయలుదేరాడు.
కానీ, కుబేరగుప్తుడి ఇంటివాకిలి దాటాడో లేదో, ఆ వర్తకుడు ఏదో చెప్పటం మరచిన వాడిలా పరుగు పరుగున బయటికి వచ్చి,
"స్వామీ, స్వామీ, ఒక మాట, ఇటు రండి", అని పిలిచాడు.
Saturday, September 12, 2009
రెండవ మకాము - పేద విప్రుని కథ - 1
మరునాడు గురుశిష్యులు అక్కడికి ఇరవై గడియల దూరంలో ఉన్న
మరో ఊరిబయట శివాలయానికి చేరారు. గుణాకరుడు సమీపాన ఉన్న ఒక చిన్న పల్లెకు
వెళ్లి దినుసులు, సామగ్రి తెచ్చి వంట చేశాడు. యోగానందుడు భోజనం చేసి విశ్రమించాడు.
తరువాత గుణాకరుడు కూడా తిని, పాత్రలు శుద్ధిచేసి వాటికోసం వచ్చిన ఒకడికి ఇచ్చి
తిరిగిపంపాడు. గుణాకరుడు గురువు దగ్గర కూర్చుని, "
స్వామీ, ఈ దేవళం మంచి పనితనంతో దృఢంగా ఉంది.
కానీ ఇందులో శివలింగం కానీ, వేరే చిహ్నం కానీ లేదు.
ఇందుకు కారణమేమిటి", అని అడిగాడు.
అందుకు యోగానందుడు ఇలా చెప్పనారంభించాడు.
గుణాకరా, ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఒక గొప్ప పల్లె ఉండేది.
ఈ శివాలయానికి తూర్పుపడమరలుగా ఒక సన్నిధి వీధి, దానికి రెండువైపులా చిన్నచిన్నవీధులు, వాటిలో వర్తకులు, బ్రాహ్మణుల ఇళ్లు ఉండేవి.
గ్రామంలో అందరూ కొద్దోగొప్పో ధనవంతులే అయినా వేదశర్మ అనే బ్రాహ్మణుడు మాత్రం నిత్యదరిద్రంతో బాధపడేవాడు.
భార్యను, ఐదుగురు పిల్లలను పోషించటానికి రోజూ భిక్షం ఎత్తి దొరికిన చాలీచాలని బియ్యంతోనే తృప్తిగా ఉండేవాడు.
ఈ శివాలయం అప్పట్లో మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుపుకుంటూ ఉన్నతస్థితిలో ఉండేది.
వేదశర్మ రోజూ ఉదయాన్నే ఈ ఆలయానికి నూటయెనిమిది ప్రదక్షిణలు చేసి, తన అక్షయపాత్రతో ఊరిలోకి వెళ్లేవాడు.
ఒకరోజు ఎప్పటిలాగే వేదశర్మ ప్రాతఃకాలాన ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసుకుని బయటికి వెళ్లాడు.
అదే సమయానికి గుడివెనుక దంతధావనం చేసుకుంటున్న కుబేరగుప్తుడనే ధనవంతుడికి గుడిలోనుండి కొన్ని మాటలు వినిపించాయి.
దేవళంలో ఈశ్వరుడు పిలిచినట్లు,"నందీ, నందీ", అని వినపడింది.
ఈ వింత ఏమిటో చూద్దామని, కుబేరగుప్తుడు గుడిగోడకు ఆనుకుని చెవులు రిక్కించాడు.
"దేవా, సేవకుడిని, మీ ఆజ్ఞకోసం సిద్ధంగా ఉన్నాను", అని నందీశ్వరుడు చెప్పటం వినపడింది.
"నందీ, మరేమీ లేదు కానీ, నిత్యదరిద్రుడైన వేదశర్మ రోజూ వచ్చి నన్ను సేవిస్తుంటాడు.
పాపం, అతని మీద నాకు చాలా కనికరం కలిగింది.
ఏదైనా సహాయం చేయదలిచాను. కాబట్టి నువ్వు నా ఆజ్ఞ ప్రకారం, నేటి సాయంత్రం లోపల అతడికి పదివేల నిష్కములు చేరేలా చెయ్యి", అని శివుడు పలకటం,
"స్వామీ, తమ ఆజ్ఞ", అని నంది అంగీకరించటం కుబేరగుప్తుడు స్పష్టంగా విన్నాడు.
మరో ఊరిబయట శివాలయానికి చేరారు. గుణాకరుడు సమీపాన ఉన్న ఒక చిన్న పల్లెకు
వెళ్లి దినుసులు, సామగ్రి తెచ్చి వంట చేశాడు. యోగానందుడు భోజనం చేసి విశ్రమించాడు.
తరువాత గుణాకరుడు కూడా తిని, పాత్రలు శుద్ధిచేసి వాటికోసం వచ్చిన ఒకడికి ఇచ్చి
తిరిగిపంపాడు. గుణాకరుడు గురువు దగ్గర కూర్చుని, "
స్వామీ, ఈ దేవళం మంచి పనితనంతో దృఢంగా ఉంది.
కానీ ఇందులో శివలింగం కానీ, వేరే చిహ్నం కానీ లేదు.
ఇందుకు కారణమేమిటి", అని అడిగాడు.
అందుకు యోగానందుడు ఇలా చెప్పనారంభించాడు.
గుణాకరా, ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఒక గొప్ప పల్లె ఉండేది.
ఈ శివాలయానికి తూర్పుపడమరలుగా ఒక సన్నిధి వీధి, దానికి రెండువైపులా చిన్నచిన్నవీధులు, వాటిలో వర్తకులు, బ్రాహ్మణుల ఇళ్లు ఉండేవి.
గ్రామంలో అందరూ కొద్దోగొప్పో ధనవంతులే అయినా వేదశర్మ అనే బ్రాహ్మణుడు మాత్రం నిత్యదరిద్రంతో బాధపడేవాడు.
భార్యను, ఐదుగురు పిల్లలను పోషించటానికి రోజూ భిక్షం ఎత్తి దొరికిన చాలీచాలని బియ్యంతోనే తృప్తిగా ఉండేవాడు.
ఈ శివాలయం అప్పట్లో మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుపుకుంటూ ఉన్నతస్థితిలో ఉండేది.
వేదశర్మ రోజూ ఉదయాన్నే ఈ ఆలయానికి నూటయెనిమిది ప్రదక్షిణలు చేసి, తన అక్షయపాత్రతో ఊరిలోకి వెళ్లేవాడు.
ఒకరోజు ఎప్పటిలాగే వేదశర్మ ప్రాతఃకాలాన ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసుకుని బయటికి వెళ్లాడు.
అదే సమయానికి గుడివెనుక దంతధావనం చేసుకుంటున్న కుబేరగుప్తుడనే ధనవంతుడికి గుడిలోనుండి కొన్ని మాటలు వినిపించాయి.
దేవళంలో ఈశ్వరుడు పిలిచినట్లు,"నందీ, నందీ", అని వినపడింది.
ఈ వింత ఏమిటో చూద్దామని, కుబేరగుప్తుడు గుడిగోడకు ఆనుకుని చెవులు రిక్కించాడు.
"దేవా, సేవకుడిని, మీ ఆజ్ఞకోసం సిద్ధంగా ఉన్నాను", అని నందీశ్వరుడు చెప్పటం వినపడింది.
"నందీ, మరేమీ లేదు కానీ, నిత్యదరిద్రుడైన వేదశర్మ రోజూ వచ్చి నన్ను సేవిస్తుంటాడు.
పాపం, అతని మీద నాకు చాలా కనికరం కలిగింది.
ఏదైనా సహాయం చేయదలిచాను. కాబట్టి నువ్వు నా ఆజ్ఞ ప్రకారం, నేటి సాయంత్రం లోపల అతడికి పదివేల నిష్కములు చేరేలా చెయ్యి", అని శివుడు పలకటం,
"స్వామీ, తమ ఆజ్ఞ", అని నంది అంగీకరించటం కుబేరగుప్తుడు స్పష్టంగా విన్నాడు.
Saturday, September 5, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 6
మరుసటిరోజు ఒక గుర్రపురౌతు సభకు వచ్చి చక్రవర్తికి ఒక ఉత్తరం అందించాడు.
ఆ ఉత్తరంలో,
"మహారాజా, సత్యశీలుడి మంత్రి వసుదేవుడు ఆశీర్వదించి వ్రాస్తున్న విజ్ఞాపన.
మీరు దండెత్తినప్పడు నేను లేకపోవటం వల్ల ఇంత జరిగింది.
నేను ఉండి ఉంటే సుందరీమణిని మీకు అప్పగించమని సలహా ఇచ్చేవాడిని.
మీతో విరోధం మాకు క్షేమం కాదు.
నేటికి ఐదవరోజు మీరు కోరిన రాణిని నేను అప్పగిస్తాను.
విరోధం విడిచి మా రాజును, రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని విన్నపం, వసుదేవుడు", అని ఉంది.
ప్రతాపవర్ధనుడు అది చదివి ఆనందంతో దాన్ని ధనంజయుడికి ఇచ్చి,
"వసుదేవుడు ఈ ఉత్తరం పంపి ఐదు రోజులయింది.
కాబట్టి, ఇప్పటికే రాణితో ఊరికి చేరి ఉంటాడు.
మనం బయలుదేరుదాం పద", అని కొలువు చాలించాడు.
చక్రవర్తి అలంకరించుకొని సిద్ధమై ఉండగా, ధనంజయుడు అక్కడికి వచ్చి,
"ప్రభూ, వసుదేవుడు ఊరి బయట ఉన్నానని వార్త పంపాడు.
మీ వెంట పరివారం చాలా తక్కువ ఉండాలనీ, సుందరీమణి ఆడంబరంగా రావటానికి జంకుతోందనీ తెలియజేశాడు.
సత్యశీలుడిని కూడా మనతో తీసుకు వెళ్లి, అతడి ముందే మీరు ఆమెను చేపట్టాలని నా కోరిక", అన్నాడు.
ప్రతాపవర్ధనుడికి కూడా అదే ఇష్టమవటంతో, సత్యశీలుడికి ఒక పల్లకీ ఏర్పాటు చేశాడు.
తమతో ధనంజయుడు, కొద్దిమంది భటులు తప్ప మరెవరూ రాకూడదని ఆజ్ఞాపించాడు.
అప్పటికే రాత్రి అయినా, వసుదేవుడి కోరిక మేరకు దివిటీలు లేకుండానే అందరూ బయలుదేరారు.
ఊరి బయట శివాలయం దగ్గర ఒక మూతపల్లకీతో ఉన్న వసుదేవుడు చక్రవర్తి అక్కడికి చేరగానే,
"మహారాజా, పల్లకీలో సుందరీమణి ఉంది.
ఆమెను స్వీకరించి, మా రాజును మాకు అప్పగించండి", అన్నాడు.
ప్రతాపవర్ధనుడు వెంటనే ఆ పల్లకీలో ఎక్కి కూర్చున్నాడు.
ధనంజయుడు, "చక్రవర్తి పల్లకీని నగరంలోకి తీసుకువెళ్లండి", అని తమతో వచ్చిన బోయీలను ఆజ్ఞాపించాడు.
వాళ్లు సత్యశీలుడున్న పల్లకీని దింపి, ప్రతాపవర్ధనుడున్న పల్లకీని సమీపిస్తుండగా మరుగున ఉన్న కొందరు భటులు వచ్చి వాళ్లను, చక్రవర్తితో వచ్చిన భటులను సంహరించారు.
పల్లకీలో ఉన్న ప్రతావవర్ధనుడికి ఇదేమీ తెలియక, తన పక్కనే ఉన్న స్త్రీ చేతులను అందుకోవటానికి ప్రయత్నించాడు.
ఆమె వెంటనే చక్రవర్తి చేతులకు తన దగ్గర ఉన్న సంకెలలు బిగించింది.
తరువాత తన స్త్రీ వేషం తొలగించి, "పాపాత్ముడా, పరస్త్రీని మోహించి, మా రాజును బంధించినందుకు ఫలం అనుభవించు", అని తాను జయపాలుడన్న విషయం బయటపెట్టాడు. జరిగినదంతా వసుదేవుడి మాయ అని ప్రతాపవర్ధనుడికి అర్ధమై ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు.
రాత్రి ప్రయాణం చేసి అందరూ విజయపురం ప్రవేశించారు.
వీరశేఖరుడు కొద్దిమంది భటులతోనే కోటలోకి వెళ్లి శివవర్మను చంపి, పట్టణం వశం చేసుకున్నాడు.
సత్యశీలుడు సింహాసనం అధిష్ఠించి, ప్రతాపవర్ధనుడిని చెరసాలలో బంధించాడు.
గుణాకరా, ఇదంతా నీకు వింతగా తోచవచ్చు.
రహస్యం చెప్తాను విను.
వసుదేవుడు లేని సమయంలో ప్రతాపవర్ధనుడు దండెత్తి విజయపురాన్ని ముట్టడించాడు కదా.
అప్పుడు మంత్రిగా ఉన్న జయపాలుడు వీరశేఖరుడి వేషంలో చక్రవర్తిని మోసం చేసి, సుందరీమణిని బయటికి తరలించటానికి సహాయపడ్డాడు.
పని జరగగానే జయపాలుడు అక్కడి నుండి బయలుదేరి సుందరీమణిని, సత్యశీలుడి స్నేహితుడైన ఒక భిల్లరాజు దగ్గర కొండలలో భద్రంగా దాచాడు. తరువాత వసుదేవుడిని కలిసి జరిగినది వివరించాడు.
ఆ పక్క రోజు, శవాలలో దాక్కున్న వీరశేఖరుడు కూడా వీరిని చేరి, చక్రవర్తి సత్యశీలుడిని కమలాకరపురం చెరసాలలో బంధించాడని తెలిపాడు.
అప్పుడు వసుదేవుడు వీరశేఖరుడిని ధనంజయుడి రూపంలో పంపి, తాను యోగి రూపంలో చక్రవర్తి నగరంలో ప్రవేశించాడు.
ఉత్తరంలో చెప్పిన ప్రకారం జయపాలుడు స్త్రీరూపం ధరించి భటులతో, వసుదేవుడితో ఊరిబయట వేచి ఉన్నాడు.
తరువాత జరిగినదంతా నీకు తెలుసు. ఆ పై వృత్తాంతం విను.
తమ చక్రవర్తి విజయపురంలో బందీగా ఉన్నాడన్న విషయం ప్రతాపవర్ధనుడి మంత్రి విశ్వనాథుడికి తెలిసింది.
ఎంత సైన్యంతో వెళ్లినా వసుదేవుడి జిత్తులను ఓడించి గెలవటం అసాధ్యమని నిర్ణయించి, సంధి కోసం బయలుదేరాడు.
సత్యశీలుడు, వసుదేవుడు విశ్వనాథుడిని గౌరవసత్కారాలతో ఆహ్వానించారు.
విశ్వనాథుడు తన చక్రవర్తి తప్పలను ఒప్పుకొని, తమ రాజ్యాల మధ్య ఇకపై విరోధం ఉండదని ప్రమాణం చేశాడు.
విశ్వనాథుడు నమ్మదగ్గవాడు కాబట్టి, సత్యశీలుడి అనుమతితో వసుదేవుడు ప్రతాపవర్ధనుడిని విడిచిపెట్టాడు.
చక్రవర్తి సత్యశీలుడు చూపిన మర్యాదకు పశ్చాత్తాపపడి, తన పనులకు సిగ్గుపడి, దీనంగా విశ్వనాథుడితో కమలాకరపురానికి తిరిగివెళ్లాడు. తరువాత సత్యశీలుడు సుందరీమణిని తిరిగి విజయపురానికి పిలిపించి, ఆమె కోరిక ప్రకారం, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్లు ప్రతాపవర్ధనుడిలా అధోగతి పాలవుతారని తెలిపేలా నువ్వు చూసిన వింతను నగరమధ్యంలో స్థాపించింది. తరువాత ఎన్నో శతాబ్దాలు గడిచి ఆ పట్టణాలన్నీ అంతరించాయి. విజయపురం ఉన్న స్థానంలో ఈ పల్లె ఏర్పడింది. ఆ పట్టణం పోయినా, వారు నిలిపిన లోహవిగ్రహం మాత్రం గుర్తుగా మిగిలిపోయింది", అని ముగించాడు.
ఆ ఉత్తరంలో,
"మహారాజా, సత్యశీలుడి మంత్రి వసుదేవుడు ఆశీర్వదించి వ్రాస్తున్న విజ్ఞాపన.
మీరు దండెత్తినప్పడు నేను లేకపోవటం వల్ల ఇంత జరిగింది.
నేను ఉండి ఉంటే సుందరీమణిని మీకు అప్పగించమని సలహా ఇచ్చేవాడిని.
మీతో విరోధం మాకు క్షేమం కాదు.
నేటికి ఐదవరోజు మీరు కోరిన రాణిని నేను అప్పగిస్తాను.
విరోధం విడిచి మా రాజును, రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని విన్నపం, వసుదేవుడు", అని ఉంది.
ప్రతాపవర్ధనుడు అది చదివి ఆనందంతో దాన్ని ధనంజయుడికి ఇచ్చి,
"వసుదేవుడు ఈ ఉత్తరం పంపి ఐదు రోజులయింది.
కాబట్టి, ఇప్పటికే రాణితో ఊరికి చేరి ఉంటాడు.
మనం బయలుదేరుదాం పద", అని కొలువు చాలించాడు.
చక్రవర్తి అలంకరించుకొని సిద్ధమై ఉండగా, ధనంజయుడు అక్కడికి వచ్చి,
"ప్రభూ, వసుదేవుడు ఊరి బయట ఉన్నానని వార్త పంపాడు.
మీ వెంట పరివారం చాలా తక్కువ ఉండాలనీ, సుందరీమణి ఆడంబరంగా రావటానికి జంకుతోందనీ తెలియజేశాడు.
సత్యశీలుడిని కూడా మనతో తీసుకు వెళ్లి, అతడి ముందే మీరు ఆమెను చేపట్టాలని నా కోరిక", అన్నాడు.
ప్రతాపవర్ధనుడికి కూడా అదే ఇష్టమవటంతో, సత్యశీలుడికి ఒక పల్లకీ ఏర్పాటు చేశాడు.
తమతో ధనంజయుడు, కొద్దిమంది భటులు తప్ప మరెవరూ రాకూడదని ఆజ్ఞాపించాడు.
అప్పటికే రాత్రి అయినా, వసుదేవుడి కోరిక మేరకు దివిటీలు లేకుండానే అందరూ బయలుదేరారు.
ఊరి బయట శివాలయం దగ్గర ఒక మూతపల్లకీతో ఉన్న వసుదేవుడు చక్రవర్తి అక్కడికి చేరగానే,
"మహారాజా, పల్లకీలో సుందరీమణి ఉంది.
ఆమెను స్వీకరించి, మా రాజును మాకు అప్పగించండి", అన్నాడు.
ప్రతాపవర్ధనుడు వెంటనే ఆ పల్లకీలో ఎక్కి కూర్చున్నాడు.
ధనంజయుడు, "చక్రవర్తి పల్లకీని నగరంలోకి తీసుకువెళ్లండి", అని తమతో వచ్చిన బోయీలను ఆజ్ఞాపించాడు.
వాళ్లు సత్యశీలుడున్న పల్లకీని దింపి, ప్రతాపవర్ధనుడున్న పల్లకీని సమీపిస్తుండగా మరుగున ఉన్న కొందరు భటులు వచ్చి వాళ్లను, చక్రవర్తితో వచ్చిన భటులను సంహరించారు.
పల్లకీలో ఉన్న ప్రతావవర్ధనుడికి ఇదేమీ తెలియక, తన పక్కనే ఉన్న స్త్రీ చేతులను అందుకోవటానికి ప్రయత్నించాడు.
ఆమె వెంటనే చక్రవర్తి చేతులకు తన దగ్గర ఉన్న సంకెలలు బిగించింది.
తరువాత తన స్త్రీ వేషం తొలగించి, "పాపాత్ముడా, పరస్త్రీని మోహించి, మా రాజును బంధించినందుకు ఫలం అనుభవించు", అని తాను జయపాలుడన్న విషయం బయటపెట్టాడు. జరిగినదంతా వసుదేవుడి మాయ అని ప్రతాపవర్ధనుడికి అర్ధమై ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు.
రాత్రి ప్రయాణం చేసి అందరూ విజయపురం ప్రవేశించారు.
వీరశేఖరుడు కొద్దిమంది భటులతోనే కోటలోకి వెళ్లి శివవర్మను చంపి, పట్టణం వశం చేసుకున్నాడు.
సత్యశీలుడు సింహాసనం అధిష్ఠించి, ప్రతాపవర్ధనుడిని చెరసాలలో బంధించాడు.
గుణాకరా, ఇదంతా నీకు వింతగా తోచవచ్చు.
రహస్యం చెప్తాను విను.
వసుదేవుడు లేని సమయంలో ప్రతాపవర్ధనుడు దండెత్తి విజయపురాన్ని ముట్టడించాడు కదా.
అప్పుడు మంత్రిగా ఉన్న జయపాలుడు వీరశేఖరుడి వేషంలో చక్రవర్తిని మోసం చేసి, సుందరీమణిని బయటికి తరలించటానికి సహాయపడ్డాడు.
పని జరగగానే జయపాలుడు అక్కడి నుండి బయలుదేరి సుందరీమణిని, సత్యశీలుడి స్నేహితుడైన ఒక భిల్లరాజు దగ్గర కొండలలో భద్రంగా దాచాడు. తరువాత వసుదేవుడిని కలిసి జరిగినది వివరించాడు.
ఆ పక్క రోజు, శవాలలో దాక్కున్న వీరశేఖరుడు కూడా వీరిని చేరి, చక్రవర్తి సత్యశీలుడిని కమలాకరపురం చెరసాలలో బంధించాడని తెలిపాడు.
అప్పుడు వసుదేవుడు వీరశేఖరుడిని ధనంజయుడి రూపంలో పంపి, తాను యోగి రూపంలో చక్రవర్తి నగరంలో ప్రవేశించాడు.
ఉత్తరంలో చెప్పిన ప్రకారం జయపాలుడు స్త్రీరూపం ధరించి భటులతో, వసుదేవుడితో ఊరిబయట వేచి ఉన్నాడు.
తరువాత జరిగినదంతా నీకు తెలుసు. ఆ పై వృత్తాంతం విను.
తమ చక్రవర్తి విజయపురంలో బందీగా ఉన్నాడన్న విషయం ప్రతాపవర్ధనుడి మంత్రి విశ్వనాథుడికి తెలిసింది.
ఎంత సైన్యంతో వెళ్లినా వసుదేవుడి జిత్తులను ఓడించి గెలవటం అసాధ్యమని నిర్ణయించి, సంధి కోసం బయలుదేరాడు.
సత్యశీలుడు, వసుదేవుడు విశ్వనాథుడిని గౌరవసత్కారాలతో ఆహ్వానించారు.
విశ్వనాథుడు తన చక్రవర్తి తప్పలను ఒప్పుకొని, తమ రాజ్యాల మధ్య ఇకపై విరోధం ఉండదని ప్రమాణం చేశాడు.
విశ్వనాథుడు నమ్మదగ్గవాడు కాబట్టి, సత్యశీలుడి అనుమతితో వసుదేవుడు ప్రతాపవర్ధనుడిని విడిచిపెట్టాడు.
చక్రవర్తి సత్యశీలుడు చూపిన మర్యాదకు పశ్చాత్తాపపడి, తన పనులకు సిగ్గుపడి, దీనంగా విశ్వనాథుడితో కమలాకరపురానికి తిరిగివెళ్లాడు. తరువాత సత్యశీలుడు సుందరీమణిని తిరిగి విజయపురానికి పిలిపించి, ఆమె కోరిక ప్రకారం, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్లు ప్రతాపవర్ధనుడిలా అధోగతి పాలవుతారని తెలిపేలా నువ్వు చూసిన వింతను నగరమధ్యంలో స్థాపించింది. తరువాత ఎన్నో శతాబ్దాలు గడిచి ఆ పట్టణాలన్నీ అంతరించాయి. విజయపురం ఉన్న స్థానంలో ఈ పల్లె ఏర్పడింది. ఆ పట్టణం పోయినా, వారు నిలిపిన లోహవిగ్రహం మాత్రం గుర్తుగా మిగిలిపోయింది", అని ముగించాడు.
Saturday, August 29, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 5
లోపల ఉన్న సత్యశీలుడు, వీరశేఖరుడు తమకున్న సైన్యంతో వారి దాడిని ఆపలేకపోయారు.
శత్రుసేనలు కోటలో చొరబడ్డాయి.
వీరశేఖరుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం చనిపోయిన శవాల మధ్యలో దాక్కున్నాడు.
సైనికులు సత్యశీలుడిని బంధించి చక్రవర్తి ముందు నిలిపారు.
అంతఃపురం గాలించినా సుందరీమణి కనపడలేదని ప్రతాపవర్ధనుడికి తెలిపారు.
ప్రతాపవర్ధనుడు కోపంతో, "ఓరీ, సుందరీమణిని ఎక్కడ దాచావు? నా ఆధిపత్యం అంగీకరించి ఆమెను అప్పగిస్తే నీ రాజ్యం తిరిగి ప్రసాదిస్తాను. లేకపోతే నీ కండలు తరిగి కాకులకు వేస్తాను", అని బెదిరించాడు. కానీ సత్యశీలుడు భయపడక, "నీచుడా, నువ్వు చక్రవర్తి పదవికి తగవు. నాశనమవుతావు", అని నిందించసాగాడు.
ఆ మాటలకు ప్రతాపవర్ధనుడు కత్తిదూసి సత్యశీలుడి తల నరకబోయాడు.
కానీ మంత్రి విశ్వనాథుడు అతడిని ఆపి, "ఇతడిని చంపితే సుందరీమణికి వైధవ్యం కలుగుతుంది. చక్రవర్తి అలాంటి స్త్రీని చేపట్టరాదు.
ఎప్పటికైనా ఆమె మనకు చిక్కుతుంది. సత్యశీలుడు బతికుండగానే ఆమెను చేపట్టటం గొప్పతనం", అని బోధించాడు.
ఇది యుక్తంగా తోచి, ప్రతాపవర్ధనుడు శివవర్మ అనేవాడిని విజయపురంలో తన ప్రతినిధిగా నియమించి,
సత్యశీలుడిని తనతో కమలాకరపురానికి తీసుకువచ్చి కారాగారంలో బంధించాడు.
సుందరీమణిని కనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానం ప్రకటించాడు.
ఆ ఆశకులోనై చాలామంది వెతికినా ఆమె జాడ తెలిసింది కాదు.
ఇటువంటి సమయంలో ధనంజయుడనే యువకుడు తన బుద్ధిబలం ప్రదర్శించి కొలువులో స్థానం సంపాదించాడు.
కొద్దికాలంలోనే ప్రతాపవర్ధనుడికి అత్యంత ఆప్తుడయ్యాడు. అతడి మాటను చక్రవర్తి దైవవాక్యంలా పాటించసాగాడు.
ధనంజయుడు సుందరీమణిని వెతికించటం కోసం ప్రబలప్రయత్నం మొదలుపెట్టాడు.
ఇది తెలిసిన ప్రతాపవర్ధనుడు ఇంకా సంతోషించాడు.
ఇది జరిగిన కొన్నిరోజులకు జ్ఞానసిద్ధి అనే యోగి, తన శిష్యులతో కమలాకరపురంలో ప్రవేశించి,
ఊరిబయట శివాలయంలో మకాము చేశాడు. అది మొదలు ఆ ఊరి ప్రజలు అతడిని మహాత్ముడని పూజించసాగారు.
అతడు త్రికాలవేది అని పేరుపడటంతో జనం గుంపులు గుంపులుగా అతడి దర్శనం చేసుకోవటం ప్రారంభించారు.
ఒకరోజు ధనంజయుడు ఆ యోగి మహత్యం ప్రతాపవర్ధనుడికి తెలిపి, సుందరీమణి గురించి అతడిని అడిగితే ఫలం ఉండవచ్చని సూచించాడు. ప్రతాపవర్ధనుడు ఆ ప్రకారమే జ్ఞానసిద్ధిని కలిసి, ప్రార్థించి, తన పరిస్థితి తెలిపాడు. ఆ యోగి అప్పుడు ఇలా అన్నాడు,
"మహారాజా, మరో వారం రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నువ్వు ఒక రాజును బంధించి ఉన్నావు. ఆ రాజును పట్టి తెచ్చేటప్పుడు అతడి మంత్రి అక్కడ లేడు. ఆ మంత్రికి విషయం తెలిసి, ఒక ఆడదానికోసం రాజ్యం వదిలి చెరసాలలో ఉండటం బుద్ధిమంతుల లక్షణం కాదని, ఆమె ఎక్కడుందో కనిపెట్టి, మీకప్పగించి, తన రాజును విడిపించుకోవాలనుకుంటున్నాడు".
ఇది విని ప్రతాపవర్ధనుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ప్రతిరోజూ జ్ఞానసిద్ధిని దర్శించుకోసాగాడు.
ఒక వారం గడిచింది.
శత్రుసేనలు కోటలో చొరబడ్డాయి.
వీరశేఖరుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం చనిపోయిన శవాల మధ్యలో దాక్కున్నాడు.
సైనికులు సత్యశీలుడిని బంధించి చక్రవర్తి ముందు నిలిపారు.
అంతఃపురం గాలించినా సుందరీమణి కనపడలేదని ప్రతాపవర్ధనుడికి తెలిపారు.
ప్రతాపవర్ధనుడు కోపంతో, "ఓరీ, సుందరీమణిని ఎక్కడ దాచావు? నా ఆధిపత్యం అంగీకరించి ఆమెను అప్పగిస్తే నీ రాజ్యం తిరిగి ప్రసాదిస్తాను. లేకపోతే నీ కండలు తరిగి కాకులకు వేస్తాను", అని బెదిరించాడు. కానీ సత్యశీలుడు భయపడక, "నీచుడా, నువ్వు చక్రవర్తి పదవికి తగవు. నాశనమవుతావు", అని నిందించసాగాడు.
ఆ మాటలకు ప్రతాపవర్ధనుడు కత్తిదూసి సత్యశీలుడి తల నరకబోయాడు.
కానీ మంత్రి విశ్వనాథుడు అతడిని ఆపి, "ఇతడిని చంపితే సుందరీమణికి వైధవ్యం కలుగుతుంది. చక్రవర్తి అలాంటి స్త్రీని చేపట్టరాదు.
ఎప్పటికైనా ఆమె మనకు చిక్కుతుంది. సత్యశీలుడు బతికుండగానే ఆమెను చేపట్టటం గొప్పతనం", అని బోధించాడు.
ఇది యుక్తంగా తోచి, ప్రతాపవర్ధనుడు శివవర్మ అనేవాడిని విజయపురంలో తన ప్రతినిధిగా నియమించి,
సత్యశీలుడిని తనతో కమలాకరపురానికి తీసుకువచ్చి కారాగారంలో బంధించాడు.
సుందరీమణిని కనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానం ప్రకటించాడు.
ఆ ఆశకులోనై చాలామంది వెతికినా ఆమె జాడ తెలిసింది కాదు.
ఇటువంటి సమయంలో ధనంజయుడనే యువకుడు తన బుద్ధిబలం ప్రదర్శించి కొలువులో స్థానం సంపాదించాడు.
కొద్దికాలంలోనే ప్రతాపవర్ధనుడికి అత్యంత ఆప్తుడయ్యాడు. అతడి మాటను చక్రవర్తి దైవవాక్యంలా పాటించసాగాడు.
ధనంజయుడు సుందరీమణిని వెతికించటం కోసం ప్రబలప్రయత్నం మొదలుపెట్టాడు.
ఇది తెలిసిన ప్రతాపవర్ధనుడు ఇంకా సంతోషించాడు.
ఇది జరిగిన కొన్నిరోజులకు జ్ఞానసిద్ధి అనే యోగి, తన శిష్యులతో కమలాకరపురంలో ప్రవేశించి,
ఊరిబయట శివాలయంలో మకాము చేశాడు. అది మొదలు ఆ ఊరి ప్రజలు అతడిని మహాత్ముడని పూజించసాగారు.
అతడు త్రికాలవేది అని పేరుపడటంతో జనం గుంపులు గుంపులుగా అతడి దర్శనం చేసుకోవటం ప్రారంభించారు.
ఒకరోజు ధనంజయుడు ఆ యోగి మహత్యం ప్రతాపవర్ధనుడికి తెలిపి, సుందరీమణి గురించి అతడిని అడిగితే ఫలం ఉండవచ్చని సూచించాడు. ప్రతాపవర్ధనుడు ఆ ప్రకారమే జ్ఞానసిద్ధిని కలిసి, ప్రార్థించి, తన పరిస్థితి తెలిపాడు. ఆ యోగి అప్పుడు ఇలా అన్నాడు,
"మహారాజా, మరో వారం రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నువ్వు ఒక రాజును బంధించి ఉన్నావు. ఆ రాజును పట్టి తెచ్చేటప్పుడు అతడి మంత్రి అక్కడ లేడు. ఆ మంత్రికి విషయం తెలిసి, ఒక ఆడదానికోసం రాజ్యం వదిలి చెరసాలలో ఉండటం బుద్ధిమంతుల లక్షణం కాదని, ఆమె ఎక్కడుందో కనిపెట్టి, మీకప్పగించి, తన రాజును విడిపించుకోవాలనుకుంటున్నాడు".
ఇది విని ప్రతాపవర్ధనుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ప్రతిరోజూ జ్ఞానసిద్ధిని దర్శించుకోసాగాడు.
ఒక వారం గడిచింది.
Saturday, August 22, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 4
ఇంతలో అర్ధరాత్రి అయింది.
ఒక యువకుడు ముందు నడుస్తుండగా నలుగురు బోయీలు ఒక పల్లకీని మోస్తూ కోట వెనుక వాకిలి నుండి బయటికి వచ్చి సైన్యం మధ్యలోనుండి వెళ్లసాగారు.
వారిని ఒక సేనాని అడ్డగించి, రహస్యంగా ఎవరో కోట నుంచి బయటికి వస్తున్నారని వీరశేఖరుడికి వార్త పంపాడు.
వీరశేఖరుడు హుటాహుటిన అక్కడికి చేరి విచారణ ప్రారంభించాడు.
అప్పడు పల్లకీ ముందు ఉన్న యువకుడు,
"అయ్యా, మేము ఈ ఊరివాళ్లం కాము. ఇక్కడికి ఆమడ దూరంలోని గ్రామవాసులము.
ఈ పల్లకీలో ఉన్న యువకుడికి కడుపు ఉబ్బరం రావటం వల్ల విజయపురంలోని వైద్యుడి దగ్గరకు వచ్చాము.
రాగానే యుద్ధం మొదలవటం వల్ల ఈ కోటలో చిక్కుపడ్డాము.
ఈ ఊరివైద్యానికి గుణం కనపడక ఇంకెక్కడైనా చికిత్స దొరుకుతుందేమోనని వెళ్తున్నాము.
శత్రుసైనికులు ఆపుతారని తెలిసినా, రోగిని చూపి బతిమాలుదామని బయలుదేరాము.
ఈ ఊరితో, రాజుతో, యుద్ధంతో మాకు సంబంధమే లేదు.
ఇతడిని మీరు పరీక్షించి మమ్మల్ని విడిచిపెట్టి ప్రాణదానం చేయండి", అన్నాడు.
వీరశేఖరుడు కొంచెం ఆలోచించి, పల్లకీలోకి తొంగిచూసి, బాధతో మూల్గుతున్న రోగిని గమనించి, మిగిలిన సేనాపతులతో,
"నిజమే, పొట్ట పెరిగి ఉండటం స్పష్టంగా కనపడుతోంది.
వీరివల్ల మనకు ప్రమాదం ఉన్నట్లు అనిపించటం లేదు. విడిచిపెట్టండి", అని ఆజ్ఞాపించాడు.
వాళ్లు బయలుదేరగానే వీరశేఖరుడు మిగిలిన సైనికులను వారివారి స్థానాలకు తిరిగి పంపించాడు.
మరుసటిరోజు ఉదయం ప్రతాపవర్ధనుడు తన సేనాపతులతో వీరశేఖరుడిని పిలిపించాడు.
వాళ్లు వచ్చి,
"మహారాజా, అర్ధరాత్రి వరకు వీరశేఖరుడు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తరువాత నుండి కనిపించటం లేదు", అని
విన్నవించారు.
ప్రతాపవర్ధనుడు, "ఓహో, మోసపోయాము. ఆ వచ్చినవాడు వీరశేఖరుడు కాదు. శత్రువర్గం వాడెవడో వేషంలో వచ్చి పని సాధించుకుని వెళ్లిపోయాడు", అన్నాడు. అప్పుడు అతడి సేనానులు రాత్రి జరిగింది ప్రతాపవర్ధనుడికి వివరించారు. జరిగిన దానికి చింతించటం వ్యర్ధమని, కోటగోడలు కూల్చి విజయపురంలో ప్రవేశించమని ప్రతాపవర్ధనుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.
వారిని ఒక సేనాని అడ్డగించి, రహస్యంగా ఎవరో కోట నుంచి బయటికి వస్తున్నారని వీరశేఖరుడికి వార్త పంపాడు.
వీరశేఖరుడు హుటాహుటిన అక్కడికి చేరి విచారణ ప్రారంభించాడు.
అప్పడు పల్లకీ ముందు ఉన్న యువకుడు,
"అయ్యా, మేము ఈ ఊరివాళ్లం కాము. ఇక్కడికి ఆమడ దూరంలోని గ్రామవాసులము.
ఈ పల్లకీలో ఉన్న యువకుడికి కడుపు ఉబ్బరం రావటం వల్ల విజయపురంలోని వైద్యుడి దగ్గరకు వచ్చాము.
రాగానే యుద్ధం మొదలవటం వల్ల ఈ కోటలో చిక్కుపడ్డాము.
ఈ ఊరివైద్యానికి గుణం కనపడక ఇంకెక్కడైనా చికిత్స దొరుకుతుందేమోనని వెళ్తున్నాము.
శత్రుసైనికులు ఆపుతారని తెలిసినా, రోగిని చూపి బతిమాలుదామని బయలుదేరాము.
ఈ ఊరితో, రాజుతో, యుద్ధంతో మాకు సంబంధమే లేదు.
ఇతడిని మీరు పరీక్షించి మమ్మల్ని విడిచిపెట్టి ప్రాణదానం చేయండి", అన్నాడు.
వీరశేఖరుడు కొంచెం ఆలోచించి, పల్లకీలోకి తొంగిచూసి, బాధతో మూల్గుతున్న రోగిని గమనించి, మిగిలిన సేనాపతులతో,
"నిజమే, పొట్ట పెరిగి ఉండటం స్పష్టంగా కనపడుతోంది.
వీరివల్ల మనకు ప్రమాదం ఉన్నట్లు అనిపించటం లేదు. విడిచిపెట్టండి", అని ఆజ్ఞాపించాడు.
వాళ్లు బయలుదేరగానే వీరశేఖరుడు మిగిలిన సైనికులను వారివారి స్థానాలకు తిరిగి పంపించాడు.
మరుసటిరోజు ఉదయం ప్రతాపవర్ధనుడు తన సేనాపతులతో వీరశేఖరుడిని పిలిపించాడు.
వాళ్లు వచ్చి,
"మహారాజా, అర్ధరాత్రి వరకు వీరశేఖరుడు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తరువాత నుండి కనిపించటం లేదు", అని
విన్నవించారు.
ప్రతాపవర్ధనుడు, "ఓహో, మోసపోయాము. ఆ వచ్చినవాడు వీరశేఖరుడు కాదు. శత్రువర్గం వాడెవడో వేషంలో వచ్చి పని సాధించుకుని వెళ్లిపోయాడు", అన్నాడు. అప్పుడు అతడి సేనానులు రాత్రి జరిగింది ప్రతాపవర్ధనుడికి వివరించారు. జరిగిన దానికి చింతించటం వ్యర్ధమని, కోటగోడలు కూల్చి విజయపురంలో ప్రవేశించమని ప్రతాపవర్ధనుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.
Saturday, August 15, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 3
ఇంతలో, సుందరీమణి చూలుదాల్చి ఎనిమిది నెలలు గడిచాయి.
వసుదేవుడికి మరో గ్రామానికి వెళ్లవలసిన అవసరం వచ్చి, జయపాలుడనే రెండవ మంత్రిని తను లేని సమయంలో ప్రభువును రక్షించమని నియమించాడు. ఇది ఎంత రహస్యంగా జరిగినా వార్త ప్రతాపవర్ధనుడికి చేరిపోయింది. చక్రవర్తి వెంటనే విజయపురాన్ని చుట్టుముట్టి, నగరానికి రాకపోకలు నిర్బంధించి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.
సైన్యమంతా కోటలో లేకపోవటం, వసుదేవుడు గ్రామానికి వెళ్లటం వల్ల సత్యశీలుడు నిస్సహాయుడై, ఉన్న కొద్ది సైన్యంతోనే ప్రతాపవర్ధనుడిని ఎదుర్కోమని తన సేనాధిపతి వీరశేఖరుడిని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు ఎంత తెలివిగా యుద్ధం చేసినా సైన్యం తక్కువ ఉండటం వల్ల ప్రతాపవర్ధనుడి విజయం తథ్యంగా కనపడసాగింది. సాయంకాలమయ్యేసరికి ప్రతాపవర్ధనుడు యుద్ధం నిలిపి, సైన్యాన్ని విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపించాడు. మరునాడు కోటలో ప్రవేశించి రాణిని చేపట్టవచ్చని నిశ్చయించి తన గుడారానికి చేరాడు.
ఆ రోజు రాత్రి, గుర్రం మీద ఒక రౌతు ప్రతాపవర్ధనుడి గుడారం వైపు వెళ్లటం చక్రవర్తి సైనికులు గమనించారు.
వాళ్లు అతడిని ఆపినప్పుడు ఆ రౌతు, "నేను చెప్పబోయే విషయం రాజుగారితో తప్ప చెప్పను. నా దగ్గర ఆయుధాలేమీ లేవు. సంశయం లేకుండా నన్ను మీ చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్లండి", అని చెప్పాడు. ఆ రౌతును పరీక్షించి సైనికులు అతడిని చక్రవర్తి ముందు నిలబెట్టారు.
అప్పుడు ఆ రౌతు, "సార్వభౌమా, నేను సత్యశీలుడి సేనాధిపతి వీరశేఖరుడిని. ఈనాటి యుద్దం ముగిసిన తరువాత, గెలవటం సాధ్యం కాదని నేను సత్యశీలుడికి తెలిపాను. యుద్ధం, విరోధం ఆపి, సుందరీమణిని మీకు అప్పగించి సంధి చేసుకోమని వివరించాను. నా మాటలకు కోపగించిన ఆ వివేకహీనుడు నా ముఖాన ఉమ్మి నన్ను సభనుండి వెళ్లగొట్టాడు. నా దుస్థితిని మీకు విన్నవించి శరణుకోరటానికి వచ్చాను", అన్నాడు.
ఇది విన్న ప్రతాపవర్ధనుడికి అనుమానం కలిగినా, విజయపురం రహస్యాలు తెలిసిన సేనాపతి తమ దగ్గర ఉండటం మేలని నిర్ణయించి,
"వీరశేఖరా, రేపు కోటలో ప్రవేశించి, నిన్ను అవమానించిన వాడిని పట్టితెచ్చి, సుందరీమణిని నాకు అప్పగించు. నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది. వెళ్లి మన పనులు నిర్వహించు", అని తన సేనానాయకులను పిలిచి, "ఇతడిని మీకు అధిపతిగా నియమిస్తున్నాను. ఇతని ఆజ్ఞను పాటించండి", అని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు తన పక్షంలో చేరటంతో విజయం తనదేనని భావించి, వసుదేవమంత్రి తిరిగివచ్చేలోపే సుందరీమణితో కమలాకరపురానికి వెళ్లవచ్చని ఆలోచిస్తూ ప్రతాపర్ధనుడు నిద్రపోయాడు.
వీరశేఖరుడితో యుద్ధం చేసిన ప్రతాపవర్ధనుడి సైనికులు కోట చుట్టూ నిద్రపోతున్నారు. ఆ రాత్రే చక్రవర్తి దగ్గర చేరిన వీరశేఖరుడు సర్వసైన్యాధిపత్యం వహిస్తూ, కోట నాలుగు వైపులా ప్రతాపవర్ధనుడి సేనాపతులను నిలిపి, గుర్రమెక్కి కోట చుట్టూ తిరుగుతూ ఎవరూ లోపలికి, బయటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు.
వసుదేవుడికి మరో గ్రామానికి వెళ్లవలసిన అవసరం వచ్చి, జయపాలుడనే రెండవ మంత్రిని తను లేని సమయంలో ప్రభువును రక్షించమని నియమించాడు. ఇది ఎంత రహస్యంగా జరిగినా వార్త ప్రతాపవర్ధనుడికి చేరిపోయింది. చక్రవర్తి వెంటనే విజయపురాన్ని చుట్టుముట్టి, నగరానికి రాకపోకలు నిర్బంధించి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.
సైన్యమంతా కోటలో లేకపోవటం, వసుదేవుడు గ్రామానికి వెళ్లటం వల్ల సత్యశీలుడు నిస్సహాయుడై, ఉన్న కొద్ది సైన్యంతోనే ప్రతాపవర్ధనుడిని ఎదుర్కోమని తన సేనాధిపతి వీరశేఖరుడిని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు ఎంత తెలివిగా యుద్ధం చేసినా సైన్యం తక్కువ ఉండటం వల్ల ప్రతాపవర్ధనుడి విజయం తథ్యంగా కనపడసాగింది. సాయంకాలమయ్యేసరికి ప్రతాపవర్ధనుడు యుద్ధం నిలిపి, సైన్యాన్ని విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపించాడు. మరునాడు కోటలో ప్రవేశించి రాణిని చేపట్టవచ్చని నిశ్చయించి తన గుడారానికి చేరాడు.
ఆ రోజు రాత్రి, గుర్రం మీద ఒక రౌతు ప్రతాపవర్ధనుడి గుడారం వైపు వెళ్లటం చక్రవర్తి సైనికులు గమనించారు.
వాళ్లు అతడిని ఆపినప్పుడు ఆ రౌతు, "నేను చెప్పబోయే విషయం రాజుగారితో తప్ప చెప్పను. నా దగ్గర ఆయుధాలేమీ లేవు. సంశయం లేకుండా నన్ను మీ చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్లండి", అని చెప్పాడు. ఆ రౌతును పరీక్షించి సైనికులు అతడిని చక్రవర్తి ముందు నిలబెట్టారు.
అప్పుడు ఆ రౌతు, "సార్వభౌమా, నేను సత్యశీలుడి సేనాధిపతి వీరశేఖరుడిని. ఈనాటి యుద్దం ముగిసిన తరువాత, గెలవటం సాధ్యం కాదని నేను సత్యశీలుడికి తెలిపాను. యుద్ధం, విరోధం ఆపి, సుందరీమణిని మీకు అప్పగించి సంధి చేసుకోమని వివరించాను. నా మాటలకు కోపగించిన ఆ వివేకహీనుడు నా ముఖాన ఉమ్మి నన్ను సభనుండి వెళ్లగొట్టాడు. నా దుస్థితిని మీకు విన్నవించి శరణుకోరటానికి వచ్చాను", అన్నాడు.
ఇది విన్న ప్రతాపవర్ధనుడికి అనుమానం కలిగినా, విజయపురం రహస్యాలు తెలిసిన సేనాపతి తమ దగ్గర ఉండటం మేలని నిర్ణయించి,
"వీరశేఖరా, రేపు కోటలో ప్రవేశించి, నిన్ను అవమానించిన వాడిని పట్టితెచ్చి, సుందరీమణిని నాకు అప్పగించు. నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది. వెళ్లి మన పనులు నిర్వహించు", అని తన సేనానాయకులను పిలిచి, "ఇతడిని మీకు అధిపతిగా నియమిస్తున్నాను. ఇతని ఆజ్ఞను పాటించండి", అని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు తన పక్షంలో చేరటంతో విజయం తనదేనని భావించి, వసుదేవమంత్రి తిరిగివచ్చేలోపే సుందరీమణితో కమలాకరపురానికి వెళ్లవచ్చని ఆలోచిస్తూ ప్రతాపర్ధనుడు నిద్రపోయాడు.
వీరశేఖరుడితో యుద్ధం చేసిన ప్రతాపవర్ధనుడి సైనికులు కోట చుట్టూ నిద్రపోతున్నారు. ఆ రాత్రే చక్రవర్తి దగ్గర చేరిన వీరశేఖరుడు సర్వసైన్యాధిపత్యం వహిస్తూ, కోట నాలుగు వైపులా ప్రతాపవర్ధనుడి సేనాపతులను నిలిపి, గుర్రమెక్కి కోట చుట్టూ తిరుగుతూ ఎవరూ లోపలికి, బయటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు.
Saturday, August 8, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 2
"గుణాకరా, ఈ ప్రాంతంలో పూర్వం విజయపురం అనే పట్టణం ఉండేది.
దానికి సత్యశీలుడనేవాడు రాజు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడనే చక్రవర్తికి సామంతుడు.
ప్రతాపవర్ధనుడు కమలాకరము అనే ఒక గొప్ప పట్టణాన్ని పరిపాలించేవాడు.
ఆయనకు విశ్వనాథుడనే బుద్ధిశాలి మంత్రి.
ప్రతాపవర్ధనుడు చాలామంది రాజులను గెలిచి, సామంతులుగా చేసుకొని, నిరంకుశంగా వాళ్ల దగ్గర కప్పం వసూలు చేసేవాడు.
అలాంటి మరొక సామంతుడు ఘూర్జర రాజ్యాధిపతి హేమవర్మ.
ఆయన కూతురైన సుందరీమణి ఎన్నో శుభలక్షణాలు గలది.
యుక్తవయస్కురాలైన ఆమెకు వివాహం చేయాలని హేమవర్మ వరులను వెదకసాగాడు.
కానీ, విజయపురం రాజైన సత్యశీలుడి గురించి విన్న సుందరీమణి, అతడినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.
సత్యశీలుడికి రహస్యంగా లేఖ రాసి అతడికి కూడా తనను వివాహమాడాలనే కోరిక ఉందని తెలుసుకుంది.
ఈలోగా ప్రతాపవర్ధనుడు సుందరీమణిని గురించి విని, ఆమెతో తనకు వివాహం జరిపించమని హేమవర్మకు ఒక ఉత్తరం పంపాడు.
దానికి సత్యశీలుడనేవాడు రాజు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడనే చక్రవర్తికి సామంతుడు.
ప్రతాపవర్ధనుడు కమలాకరము అనే ఒక గొప్ప పట్టణాన్ని పరిపాలించేవాడు.
ఆయనకు విశ్వనాథుడనే బుద్ధిశాలి మంత్రి.
ప్రతాపవర్ధనుడు చాలామంది రాజులను గెలిచి, సామంతులుగా చేసుకొని, నిరంకుశంగా వాళ్ల దగ్గర కప్పం వసూలు చేసేవాడు.
అలాంటి మరొక సామంతుడు ఘూర్జర రాజ్యాధిపతి హేమవర్మ.
ఆయన కూతురైన సుందరీమణి ఎన్నో శుభలక్షణాలు గలది.
యుక్తవయస్కురాలైన ఆమెకు వివాహం చేయాలని హేమవర్మ వరులను వెదకసాగాడు.
కానీ, విజయపురం రాజైన సత్యశీలుడి గురించి విన్న సుందరీమణి, అతడినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.
సత్యశీలుడికి రహస్యంగా లేఖ రాసి అతడికి కూడా తనను వివాహమాడాలనే కోరిక ఉందని తెలుసుకుంది.
ఈలోగా ప్రతాపవర్ధనుడు సుందరీమణిని గురించి విని, ఆమెతో తనకు వివాహం జరిపించమని హేమవర్మకు ఒక ఉత్తరం పంపాడు.
చక్రవర్తిని తిరస్కరించలేని హేమవర్మ సుందరీమణికి ఆ లేఖ చూపించగా, ఆమె సత్యశీలుడి గురించి తండ్రికి తెలిపింది.
కుమార్తెకు వ్యతిరేకంగా చేయటం ఇష్టం లేక, హేమవర్మ ప్రతాపవర్ధనుడికి విషయం తెలియజేశాడు.
అందుకు ప్రతాపవర్ధనుడు మండిపడి, "సుందరీమణి సత్యశీలుడిని పెళ్లాడినా ఆమెను విడువక, సత్యశీలుడిని రాజ్యభ్రష్టుని చేసి, కారాగారంలో ఉంచి, ఆమెను వశం చేసుకొంటాను", అని సభలో ప్రకటించాడు. అప్పటినుండి విజయపురాన్ని ఆక్రమించుకోవటానికి సమయం చూడసాగాడు.
ఇంతలో కొంతకాలానికి సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగి, ఆమె భర్తతో విజయపురానికి రాణిగా వచ్చింది.
సత్యశీలుడి మంత్రి వసుదేవుడు.
భట్టిచాణక్యయుగంధరులను మించినవాడు.
అతడి చాకచక్యానికి భయపడి శత్రువులు విజయపురం వంక కన్నెత్తికూడా చూసేవారు కాదు.
ప్రతాపవర్ధనుడు సుందరీమణికోసం ప్రబలసైన్యంతో రెండు మూడు మార్లు దండెత్తి వచ్చినా వసుదేవుడి తంత్రాలకు పరాజయం పాలయ్యాడు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడికి సామంతుడైనా, చక్రవర్తి అక్రమంగా దండెత్తిన కారణంగా వసుదేవుడి సలహామేరకు కప్పం కట్టటం నిలిపి స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. వసుదేవుడి పనులకు కోపం వచ్చినప్పటికీ, ప్రతాపవర్ధనుడు ఏమీ చేయలేక, ఆ మంత్రి లేని సమయంలో పగదీర్చుకోవాలని ఎదురుచూడసాగాడు.
కుమార్తెకు వ్యతిరేకంగా చేయటం ఇష్టం లేక, హేమవర్మ ప్రతాపవర్ధనుడికి విషయం తెలియజేశాడు.
అందుకు ప్రతాపవర్ధనుడు మండిపడి, "సుందరీమణి సత్యశీలుడిని పెళ్లాడినా ఆమెను విడువక, సత్యశీలుడిని రాజ్యభ్రష్టుని చేసి, కారాగారంలో ఉంచి, ఆమెను వశం చేసుకొంటాను", అని సభలో ప్రకటించాడు. అప్పటినుండి విజయపురాన్ని ఆక్రమించుకోవటానికి సమయం చూడసాగాడు.
ఇంతలో కొంతకాలానికి సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగి, ఆమె భర్తతో విజయపురానికి రాణిగా వచ్చింది.
సత్యశీలుడి మంత్రి వసుదేవుడు.
భట్టిచాణక్యయుగంధరులను మించినవాడు.
అతడి చాకచక్యానికి భయపడి శత్రువులు విజయపురం వంక కన్నెత్తికూడా చూసేవారు కాదు.
ప్రతాపవర్ధనుడు సుందరీమణికోసం ప్రబలసైన్యంతో రెండు మూడు మార్లు దండెత్తి వచ్చినా వసుదేవుడి తంత్రాలకు పరాజయం పాలయ్యాడు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడికి సామంతుడైనా, చక్రవర్తి అక్రమంగా దండెత్తిన కారణంగా వసుదేవుడి సలహామేరకు కప్పం కట్టటం నిలిపి స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. వసుదేవుడి పనులకు కోపం వచ్చినప్పటికీ, ప్రతాపవర్ధనుడు ఏమీ చేయలేక, ఆ మంత్రి లేని సమయంలో పగదీర్చుకోవాలని ఎదురుచూడసాగాడు.
Saturday, August 1, 2009
మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 1
యోగానందుడు, గుణాకరుడు ఒక పల్లె బయట, ఏటి పక్కనున్న ఒక మర్రిచెట్టు నీడలో విడిది చేశారు. అప్పుడు యోగానందుడు తమ ఇద్దరికీ భోజనసామగ్రి కొనటానికి సరిపోయే ఒక నాణెం గుణాకరుడికి ఇచ్చి, "గుణాకరా, గ్రామంలోకి వెళ్లి మనకు ఈ పూటకు కావలసిన పప్పు, బియ్యం కొని, ఎవరినైనా అడిగి వంటపాత్రలు తీసుకురా", అని చెప్పాడు.
వట్టిచేతులతో ఉన్న యోగి తటాలున నాణెం ఇవ్వటం చూసి గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. యోగానందుడి మహిమను కొనియాడి గ్రామానికి వెళ్లి దినుసులు కొన్నాడు. తను ఎవరో తెలియకపోయినా ఆ ఊరివారు వంటపాత్రలను సంశయం లేకుండా ఇవ్వటం కూడా యోగి ప్రభావమని భావించాడు. త్వరగా తిరిగివచ్చి, స్నానం చేసి, పొయ్యి ఏర్పరిచి, వంట చేశాడు.
ఇద్దరూ భోజనం చేసిన తర్వాత, చల్లని చెట్టు నీడలో విశ్రమించిన గురువు పాదాలు ఒత్తుతూ గుణాకరుడు, "మహాత్మా, ఈ గ్రామంలో ఒక వింత చూశాను. ఊరిమధ్యలో విశాలంగా కొంత ప్రదేశం ఉంది. అందులో రెండు శిలాస్తంభాలు ఒకదానికొకటి పది గజాల దూరంలో ఉన్నాయి. ఈ స్తంభాలపైన అడ్డంగా ఒక బండరాయి ఉంది. దూలంలా వేసిన ఈ బండరాయి మధ్యలో దగ్గర దగ్గరగా ఉన్న రెండు రంధ్రాలకు బలమైన ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి.
ఈ రెండు గొలుసులూ తలకిందులుగా ఉన్న ఒకడి కాళ్లకు కట్టి ఉన్నాయి. అతడి స్థితికి నేను బాధపడ్డాను కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే, అది మనిషి ఆకారంలో ఉన్న ఒక ఇనుప బొమ్మ మాత్రమే అని తెలిసింది. అది అలా ఉండటానికి కారణమేమిటని ఈ ఊరివారిని అడిగాను. వాళ్లు ఆ బొమ్మ ఎప్పటి నుంచో అలా ఉందనీ, తమ తాతలకు కూడా దాని వృత్తాంతం తెలియదనీ చెప్పారు.
నాకు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది! తమరు జ్ఞానదృష్టి గలవారు. ఈ విశేషమేమిటో వివరించమని ప్రార్థన", అని అడిగాడు.
యోగానందుడు జ్ఞానదృష్టితో ఆ వృత్తాంతం తెలుసుకొని ఇలా చెప్పనారంభించాడు.
వట్టిచేతులతో ఉన్న యోగి తటాలున నాణెం ఇవ్వటం చూసి గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. యోగానందుడి మహిమను కొనియాడి గ్రామానికి వెళ్లి దినుసులు కొన్నాడు. తను ఎవరో తెలియకపోయినా ఆ ఊరివారు వంటపాత్రలను సంశయం లేకుండా ఇవ్వటం కూడా యోగి ప్రభావమని భావించాడు. త్వరగా తిరిగివచ్చి, స్నానం చేసి, పొయ్యి ఏర్పరిచి, వంట చేశాడు.
ఇద్దరూ భోజనం చేసిన తర్వాత, చల్లని చెట్టు నీడలో విశ్రమించిన గురువు పాదాలు ఒత్తుతూ గుణాకరుడు, "మహాత్మా, ఈ గ్రామంలో ఒక వింత చూశాను. ఊరిమధ్యలో విశాలంగా కొంత ప్రదేశం ఉంది. అందులో రెండు శిలాస్తంభాలు ఒకదానికొకటి పది గజాల దూరంలో ఉన్నాయి. ఈ స్తంభాలపైన అడ్డంగా ఒక బండరాయి ఉంది. దూలంలా వేసిన ఈ బండరాయి మధ్యలో దగ్గర దగ్గరగా ఉన్న రెండు రంధ్రాలకు బలమైన ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి.
ఈ రెండు గొలుసులూ తలకిందులుగా ఉన్న ఒకడి కాళ్లకు కట్టి ఉన్నాయి. అతడి స్థితికి నేను బాధపడ్డాను కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే, అది మనిషి ఆకారంలో ఉన్న ఒక ఇనుప బొమ్మ మాత్రమే అని తెలిసింది. అది అలా ఉండటానికి కారణమేమిటని ఈ ఊరివారిని అడిగాను. వాళ్లు ఆ బొమ్మ ఎప్పటి నుంచో అలా ఉందనీ, తమ తాతలకు కూడా దాని వృత్తాంతం తెలియదనీ చెప్పారు.
నాకు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది! తమరు జ్ఞానదృష్టి గలవారు. ఈ విశేషమేమిటో వివరించమని ప్రార్థన", అని అడిగాడు.
యోగానందుడు జ్ఞానదృష్టితో ఆ వృత్తాంతం తెలుసుకొని ఇలా చెప్పనారంభించాడు.
కాశీరామేశ్వర మజిలీ కథలు
కాశీమజిలీ కథలతో మా ఇంట్లో ఒక పాత పుస్తకం ఉండేది.
ఇవి DD తెలుగులో అప్పట్లో వచ్చిన కథలు కాదు.
ముందు, వెనుక కొన్ని పేజీలు లేకపోవటం వల్ల పేరు, రచయిత, తేదీ, ప్రచురణ ఏమీ తెలియవు.
గ్రాంథికభాషలో (పేరోలగం లాంటి పదాలతో సహా) ఉన్న ఈ కథలు చాలా interesting గా, convoluted గా, sometimes naive గా, always amusing గా ఉండేవి.
తరువాత కాశీమజిలీ కథలు అని colloquial తెలుగులో కొన్ని పుస్తకాలు చూశాను కానీ, ఈ కథలు ఎక్కడా చూడలేదు.
ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గరే ఉండటంతో, ఆ కథలు కొంచెం వాడుక భాషలో తిరగరాద్దామని ఈ ప్రయత్నం.
ముందు, వెనుక కొన్ని పేజీలు లేకపోవటం వల్ల పేరు, రచయిత, తేదీ, ప్రచురణ ఏమీ తెలియవు.
గ్రాంథికభాషలో (పేరోలగం లాంటి పదాలతో సహా) ఉన్న ఈ కథలు చాలా interesting గా, convoluted గా, sometimes naive గా, always amusing గా ఉండేవి.
తరువాత కాశీమజిలీ కథలు అని colloquial తెలుగులో కొన్ని పుస్తకాలు చూశాను కానీ, ఈ కథలు ఎక్కడా చూడలేదు.
ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గరే ఉండటంతో, ఆ కథలు కొంచెం వాడుక భాషలో తిరగరాద్దామని ఈ ప్రయత్నం.
Hope you enjoy the stories!
Subscribe to:
Posts (Atom)